పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

రాజశేఖరచరిత్రము


గీ.

నుదరబంధంబు లాతంబు యోగపట్టె
సిగినాదంబు బెత్తంబు చెన్ను మెఱయ
నుట్టిపడ్డట్టు యోగిని యోర్తు వచ్చి
లీల నారాజశేఖరుమ్రోల నిలచి.

94


ఉ.

రమ్ము నృపాల నీదగు పరాక్రమకేళికిఁ జాలమెచ్చి మా
యమ్మ భవాని సంయమికులాగ్రణి కూరిమిబిడ్డ నిచ్చిరా
పొమ్మన వచ్చితిన్ శిఖరిపుత్త్రిక సేవకురాల నాదు గే
హమ్మున నున్న యప్పడుచు నప్పనచేసెద నంచుఁ బల్కినన్.

95


క.

మనమునఁ బ్రియపడి యయ్యో
గిని పిఁఱుదం బోయి సరసకిసలయరేఖా
జనకరుచిపుంజమంజుల
కనకమయం బైన యొక యగారముఁ గనియెన్.

96


క.

కని చేరఁబోయి యోగిని
పడుపున నొకరత్నవేదిపైనుండి ఫలా
వనిజాత జాతగిరిజా
ప్రణుతి పరోదగ్రపతగభాషలు వినుచున్.

97


క.

అచ్చట సేదలుదీఱ వి
యచ్చర విభున కొసఁగె నపు డాతిథ్యము ల
త్యుచ్చయకౌతుకమున నట
నచ్చెరువుగ వచ్చి నిలిచె నమ్మునిసుతయున్.

98


క.

చక్కని యాబాలామణి
నక్కునఁ గోల్కొలిపి దీని నవనీశ్వర పే
రుక్కున విశంకటుం డీ
చక్కటిఁ గొనపోవఁ జూచి సదయహృదయనై.

99


గీ.

ఓడ కోడకు మనుచు నేఁ గూడ బోయి
వాని నదలించి యీమౌనివరుని కూర్మి