పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

41


తనయఁ దోడ్కొనివచ్చి మత్సదనసీమ
నునిచితిని బాలఁ గొనిపొమ్ము మునికి నిమ్ము.

100


క.

అని పలికి రాజశేఖర
మనుజేశ్వర నేఁడు నాదు మందిరమునకున్
జనుదెంచితి గావున నే
ననఘంబగు నీ శుకంబు నర్పింతుఁ దగన్.

101


శా.

తూచాతప్పకయుండ నాగమకథాస్తోమంబులం జెప్పు వా
చాచాతుర్యము గానరా గతభవిష్యద్వర్తమానార్థముల్
సూచించుచున్ మది మెచ్చ నీ కుబుసు పుచ్చున్ నెచ్చెలింబోలి యీ
రాజిల్కం గయికొమ్ము పార్ధివకుమారా యంచు వర్ణించుచున్.

102


క.

శీతమయూఖకళాధర
శాతోదరి పంచినట్టి శాంబవి యొసఁగెన్
భూతలనాథకుమారుని
చేతికిఁ గరుణారసంబు చిలుకం జిలుకన్.

103


సీ.

ఇచ్చినకీరంబు ఋషిపుత్త్రియును దాను
                       వరయోగినీకాంత తెరువు చూప
బిలము వెల్వడి మౌనితిలకంబుఁ గనుఁగొని
                       సాష్టాంగవినతుల నాచరింప
నాశీర్వచఃప్రౌఢి నతఁడు సంభావించి
                       యానందబాష్పంబు లావహిల్ల
దనయాలలామ నక్కునఁ జేర్చి వాత్సల్య
                       వనధి నోలాడి యోమనుజనాథ


గీ.

యాత్మపురమున కీసేన ననిచి బదరి
కాశ్రమంబున కేతెంచి యచటి మాని
పతులఁ గనుఁగొని దీవనల్ పడసివత్తు
గాక యనవుడు సంభృతోత్కంఠుఁ డగుచు.

104