పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

39


విఖ్యాతి నోయమ్మ యావేదముల్ వాదముల్సేయ నీ వేదము ల్గాన కిచ్చో
ట నీపాదము ల్గంటి నేమంటి నావంటి పుణ్యుండు లేఁ డెచ్చటన్.

89


శా.

తల్లీ శాంభవి లోకపావని సముద్యద్భక్తితో నెవ్వఁడేన్
హృల్లేఖన్ భవదీయమంత్రకలనాహీనస్థితిం గాంచు నా
నిల్లాలై విహరించుఁ బంకజపుటీ హేలాగతు ల్మాని సం
పల్లీలావతి వానిభాగ్యము నిలింపస్వామికిం గల్గునే.

90


మ.

అని యమ్మానవనాథవర్యుఁడు తదీయాంఘ్రిద్వయం గ్రమ్మఱన్
వినతుల్ సేయ భవాని సత్కృప మది న్నిండార నోరాజనం
దన నీచండభుజాపరాక్రమకళాధైర్యంబు లే మెచ్చితిన్
గొను మే నిచ్చెద నొక్కదివ్యమణి నీకున్ వేడ్క సంధిల్లఁగన్.

91


గీ.

ఇమ్మహామణి తావకాభీప్సితముల
వలయువేళల సమకూర్చు వసుమతీశ
యమర వర్ణిత మిది యని యభవురాణి
యవనినాథున కొసఁగి యత్యాదరమున.

92


క.

జననాథ నాకుఁగా ని
ద్దనుజుని మన్నింపు మిపుడు తాపసపుత్త్రిన్
గొనివచ్చు నొక్కయోగిని
యని పల్కి యదృశ్యయయ్యె నంతటిలోనన్.

93


సీ.

అలికంబుపై రక్తతిలకంబు తెలిగన్నుఁ
                       గవయందుఁ గాటుక కర్ణపాశ
ములఁ బటికంపుగుండలములు గళమున
                       సంకుఁబూసలకంఠసరులు గుబ్బ
చనుదోయి వన్నెకుచ్చలిగంత దాపలి
                       గరమునందు విభూతి కక్షపాల
పాణిపద్మంబున మాణిక్యమయవీణ
                       పదయుగంబునఁ బైఁడిపాదుకలును