పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

రాజశేఖరచరిత్రము


ననిలోనఁ జలము పూనిన
ననిలో నిజకోపవహ్ని కాహుతి చేయున్.

56


సీ.

కడుపారఁగాఁ బచ్చికలు మేసి తముఁ దామె
                       యావులు చేసి చన్నవసి పితుకు
దతికాల మొక్కింత తప్పనీక మొగుళ్ళు
                       నెల మూఁడు వానల నెలమి గురియుఁ
బెరిఁగి దట్టంబులై బీరువోక తనర్చి
                       సకలసస్యములు దున్నకయె పండు
దలపూవు వాడక తామరతంపరై
                       ప్రజలు నూఱేండ్లును బరిణమింత్రు


గీ.

మునులు తపములు నిర్విఘ్నముగఁ జెలంగ
నెందుఁ గలిదోష మావంత జెందనీక
క్రతుఫలంబుల సురల యాకండ్లు దీర్చి
దరణిఁ బాలించె నా హేమధన్వ నృపతి.

57


క.

ఈలీల సకలధాత్రీ
పాలన మొనరింపుచును విభావసుతనయం
బాలిక యను బాలిక కుల
పాలికగా నతఁడు సౌఖ్యపరతంత్రుండై.

58


గీ.

పెద్దకాలంబు నడపిన పిదపఁ దనకు
బుత్త్రలాభంబు లేమికిఁ బొగిలి పొగిలి
యొక్కనాఁడు మనంబున నోర్వలేక
పలికె నారాజు పాలికాలలనఁ జూచి.

59


చ.

మలయజగంధి యీకరిసమాజము నీహయపంక్తి యీభటా
వలియును గల్గి నాబ్రతుకు వన్నెకు నెక్కదు పుత్త్రహీనతన్
గలువలవిందు పొందువెలిగా నుడుపంక్తులు మింట మిన్కనన్
బొలుపరి యున్నరాత్రిగతిఁ బూర్వకృతంబది యెట్టిదోగదా.

60