పుట:రాజశేఖరచరిత్రము (మాదయగారి మల్లన్న).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

13


ఉ.

మచ్చికతోడఁ బాఱులు కుమారుని నక్కునఁ జేర్చి వీథికిన్
వచ్చిసుఖోపలాలనమునన్ మునుమాపులు ముద్దుసేయగా
నిచ్చల నిచ్చలుంగని యొకించుక యేనియుఁ బాయ వేకటుల్
ముచ్చటదీఱ నింక మనముుం గయికొందుమె యట్టిభాగ్యముల్.

61


సీ.

లోచనానందకల్లోలినీభర్తకు
                       దోయజారాతి పుత్త్రుండె కాఁడె
శ్రవణహితాలాపరత్నాంకురాళికి
                       రోహణాచలము పుత్త్రుండె కాఁడె
యమితపాతకపుంజతిమిరమండలికి న
                       ఖండదీపంబు పుత్త్రుండె గాఁడె
సంసారసుఖమహీజాతసంఘమునకు
                       దోహదసేవ పుత్త్రుండె కాఁడె


గీ.

దుఃఖములఁ బాసి ముక్తికి ద్రోవ చూపి
ప్రోవఁజాలినవాఁడు పుత్త్రుండె కాఁడె
కాన నిహపరసాధనకారణంబు
తల్లిదండ్రుల కాత్మీయతనయుఁ డబల.

62


ఉ.

చందురువంటి నెమ్మొగము చక్కటిఁ దూలఁగఁ బుట్టు వెండ్రుకల్
గెందలిరాకుఁబాదములఁ గీల్కొన జేసిన యట్టిచిన్నిపై
డందెలు గల్లు గల్లుమన నాడుచు నల్లన చేరవచ్చి నా
ముందఱ నాడ నెన్నఁడొకొ ముద్దియ ముద్దుగుమారుఁ గాంచుటల్.

63


గీ.

తోయజానన యొకబుద్ధి తోఁచె నాకు
నాదికారణ మీశ్వరుం డఖిలమునకుఁ
గాన నద్దేవదేవుని కరుణ లేక
యీప్సితార్ధంబు లేరికి నేల కలుగు.

64


గీ.

నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తి రిసుమంత నెవ్వఁడు పాఱవైచుఁ