ఈ పుట ఆమోదించబడ్డది
రమ్యాలోకము
పాములు విసంబు గ్రక్కెడు ప్రాంతమందు
జంతురక్తము పడ ఘాత జరిగియుండు;
పూలపాలు కాల్వలు గట్టు పొలములందు
పాడి యావులమందలు ప్రబలియుండు.
కోకిలలను వేటాడిన కాకులెల్ల
భూపిశాచ దుష్కంఠులై పుట్టిరేమొ ?
పాటల ప్రవాహములలోన బడినరాళ్ళు
మృదుల కలభాషిణులుగ జన్మింపనోపు !
పైరగాలికి తలవంచి పసుపు మించి
ఉల్లసిలిన వెదుళ్ళు రూపొందె నేడు,
మందమకరంద హృదయంగమస్వరాను
కూల వీణారణన సూత్రకులము గాగ.