పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వతివ పద్మజుసుతుఁ డైనపులస్త్యు, సుతు విశ్రవసుఁ బొందు సోయగం బమర
మగువ నీకొడుకులు మన్మలు నితని, పగిదిఁ దేజస్వులై పరఁగెద రనినఁ
బ్రియమంది రఘువీర పితృవియోగమున, భయదసంధ్యావేళఁ బరికింప కరిగి
వనితయు నవ్విశ్రవసుఁ డగ్నిహోత్ర, మొనరించుతఱి నగ్నియునుబోలె వెలుఁగ
వీడఁబో నడఁచుచు విలసితాననము, తోడన యుజ్జ్వలాత్మునిమ్రోల నిలిచి
కంతుని జయలక్ష్మికరణిఁ జెన్నొందు, నంతఁ బౌలస్త్యుండు నయ్యింతిఁ జూచి
శ్రోణీభరంబును సురచిరకాంతి, నేణలాంఛనకలితేందుబింబంబు
నవ్వు నెమ్మొగమును నలినాక్షి నీవు, నెవ్వరికూఁతుర వేది నీపేరు
వచ్చినపని యేమి వామాక్షి యనిన, నచ్చెల్వ ముకుళితహస్తయై పలికెఁ
బెనుపొంద మాతండ్రిపేరు సుమాలి, యనఘాత్మ కైకశి యనుకన్య నేను
ననుఁ దండ్రి పుత్తెంచె నారాకతెఱఁగు, మునినాథ మీచిత్తమునఁ జూడుఁ డనిన
నత్తెఱం గెల్లను నాత్మలో నెఱిఁగి, మత్తేభగమన నీమది కోర్కిఁ గంటి
కోమలి ననుఁ బొంది కొడుకుల వడయఁ, గామించివచ్చితి గానఁ గైకొంటి
వనిత సంధ్యావేళ వచ్చుటఁ జేసి, తనయుల నిచ్చితి దారుణాత్మకులఁ
గ్రూరబుద్ధియుతుండుఁ క్రూరవర్తనుఁడుఁ, గ్రూరుండు నగు పెద్దకొడు కందులోన
ననవుడుఁ గైకసి యమ్మునీశ్వరుని, గనుఁగొని దయదోఁపఁగా నిట్టులనియె
ధాత్రిభారకుల నదయచిత్తులను న, పాత్రులఁ గృపసేయఁ బాడియె దేవ
యనుటయుఁ జంద్రబింబాస్య నీ కూర్మి, తనయుల కిద్దఱ తఱిఁ బుట్టువాఁడు
హరిపదాంబుజభక్తుఁ డనురాగచిత్తుఁ, డురతరయశుఁడు మహోజ్జ్వలుఁ డగుచు
లంకకుఁ బతియునై లలి నీదుకులముఁ, గొంకక పాలించుఁ గోర్కు లింపార
నని విశ్వవసుఁ డాడ నట్లకా కనుచు, మనమున సంతోష మంది యాలేమ
బాగైనభక్తి తోఁ బరిచర్య సేయఁ, గాఁ గొంతకాలంబు గడచిన యంతఁ
జకితాత్ములై చిత్తచలనంబు లేక, ... ... ... ... ... ... ... ...
క్రమమొప్పఁగా నెల్ల కాలంబులందు, సముఖులై యామునీశ్వరు నాశ్రమంబు
వేకువ నొకజమ్మిచెట్టుమీఁదటను, బూరిపుంజములచేఁ బొలుచుమందిరము
లారంగ రచియించి యందుఁ బెంపొందఁ, దారును పుత్రమిత్రసమేతముగను
నున్నచో నొకపక్షి యువిదయండములు, పన్నుగాఁ బొదుగుచుఁ బాయకున్నంత
నానాతినాథుండు నతిముదం బలర, మానుగా నమృతోపమానంబు లైన
ఫలరసంబులఁ దెచ్చి పరిపాటి నిడుచుఁ, బొలుపార నొకనాఁడు ప్రొద్దుమా పైనఁ