పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యని పల్కి తనపుత్రుఁ డైనసుబాహు, ననురాగమున బట్ట మర్ధితో గట్టి
న శత్రులు భీతిల్ల జనులఁ బాలింపు. శత్రుఘాతికి వైదిశాపురం బమర
ని పల్కి బలముల నఖిలవస్తువులు, జనుల మంత్రుల నొక్కసరి గాఁగఁ బంచి
పరిపాటితో నిచ్చి పట్టముల్ గట్టి, వరుస వీట్కొని యెల్లవారి నం దునిచి
రథ మెక్కి యెక్కుడురయముతో వచ్చి, పృథివీశునకు మ్రొక్కి ప్రియమారఁ బలికె
కర మొప్పఁ బట్టముల్ గట్టిరి సుతుల, పరిణతనీతిమైఁ బ్రజలఁ బాలిఁప
యేనిట మిముఁ గొల్చి యేతెంచువాఁడ, నానతి యిండన్న నంగీకరించి
నంత ఋక్షాదులు నఖిలదానవులు, సర్వగంధర్వులు సంయమీశ్వరులు
నురుతేజుఁడగు రాము డూర్ధ్వలోకమున, కరుగుట కనుగొంద మని వచ్చినారు
యని రాముఁ డెంతయు నర్ధి తమ్మునకుఁ, గొనకొని చూపిన కోర్కెతో వారు
వసుధీశ నీ వెంట వచ్చెదమనఁగ, నెసగంగ సుగ్రీవుఁ డేతెంచి మ్రొక్కి
యచ్చోట నంగదు నభిషిక్తుఁ జేసి, …..........................................
యనుమతి గైకొన నట విభీషణుఁకు, సమ్మదంబున మ్రొక్క జననాథుఁ డనియె.
ఘనులు చంద్రార్కులు గలయంతఁదాక, ననుపమస్థితి లంక నమరంగ నేలు
నక్తంచరోత్తమ నాయాజ్ఞ గాన, నుక్తు లేమియుఁ జెప్పకుండు నీ వనుచు
ననుకంపితాత్ముఁడై యంజనాతనయుఁ, గనుగొని నాకథల్ గలుగునందాక
నిత్యుండవై వీర నీ వుండు మనుచు, నత్యంతమధురంబు లైనవాక్యముల
వారింపుచును జాఁబవంతు నీక్షించి, నీరజాసనపుత్ర నీ వుండు మనుచు
తోన మైంధద్వివిధులఁ జూచి యమృత, పానంబుఁ జేసిన బల్లిదుల్ మీరు
గారవంబున గలుగునందాక కోరి మాసంతతిఁ గొలిచియుండుండు
చనుదెండు తక్కినజను లెల్ల ననుచు, మనమున మరునాఁడు మనుజేంద్రుఁ డలరి
యనఘు తేజోమూర్తి నమరు వసుష్ఠు, గనుగొని యిటమీఁదఁ గదలంగవలయు
నతిరాత్రవాజపేయాశ్వమేధాది, వితతనామంబులు వెలయుజన్నములు
నియతాగ్నిహోత్రముల్ నిజమూర్తు లమర, గయి కొనిముందటఁ గదలిపోనిండు
ప్రమదంబుతో మహాప్రస్థానకర్మ, మమరఁగఁ జేయింపు డన్న నమ్మునియు
నామహానుష్ఠాన మమరిఁ జేయించి, కనకాంబరంబులు గట్టి యానిభుఁడు
జననుతం బగు బ్రహ్మచర్యవ్రతంబు, మనమారఁ గైకొని మానంబుతోడ
కలితదర్భాంకురకరపద్ముఁ డగును, నొలసినవేట్క నయోధ్య వెల్వడఁగ
లలితాబ్జహస్తయౌ లక్ష్మి డాపలను, వలపట హ్రీ యను వామలోచనయు