పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముందటను ధ్యానమును వెన్క విండ్లు, పొందుగా నమ్ముల పురుషులై కొలువ
సావిత్రియును మునుల్ సకలదేవతలు, దౌవారికులు భృత్యదాసవర్గములు
దాసీజనము లంతఃపురాంగనలు, భూసురోత్తములును పురిమంత్రిజనులు
ధరణీసురాకృతుల్ ధరియించి రాగ బరగు నాగమవరప్రణవమంత్రములు
భరతశత్రుఘ్నులు బంధువుల్ ప్రజలు, హరినామకీర్తన మమరగాయకులు
పశుబంధములు నేఁడు బాసె మా కనుచు, పశుపక్షివాహనప్రముఖజంతువులు
పరువడి తనదృష్టిపథమునఁ బడిన, తరులతాదులుఁ గూడి తనతోడ నడువ
నామడయును మీఁద నటసాము నడచి, కోమల మగు పుణ్యకూలదేశమున
నారయఁ జల్లనై యధ్వరశ్రమంబు, వారింపఁ బశ్చిమవాహిని యైన
సరయువుఁ జొచ్చు నాసమయంబునందు, సరసిజాసనుఁ గూడి సకలసంయములు
ఇనసుధాధాములు నెల్లదేవతలు, ననిమిషాంగనలు దో నరుగుదేరంగఁ
గూడ బుష్పకములు కోటానకోటి, వేడుకతో వచ్చి వినువీథి నిలిచి
నరనాథ నీ వాదినారాయణుఁడవు, పరికించి నీమూర్తి భావింపు మనిన
వరుస పై పుష్పవర్షముల్ కురియ, సురదుందుభులు మ్రోయ సొరిది విన్వీథి
వసుధీశుఁ డమ్మహావాహినినడుమ, నసమానగతి నప్పు డనుజులు దాను
వెలుఁగు మేనులుతోడ విష్ణుఁడై పొలిచె గలిసె సుగ్రీవుండు కమలాప్తునందు

శ్రీరామచంద్రుని నిర్యాణము

చూడవచ్చిన మహీశుల్ మొదలుగాగ, వేడుక సరయూప్రవేశంబు చేసి
దివ్యరూపంబులఁ దేజంబు లెసఁగ, దివ్యయానము లెక్కి తెరగొప్ప వెలువ
నురమున గౌస్తుభ మొప్పార నాభి, పరమేష్ఠి గాంచిన పంకజం బమర
గరుడాధిరూఢుఁడై కరపంకజముల, సరిసుదర్శనపాంచజన్యంబు లమర
ననిమిషగంధర్వయక్షసిద్ధాదు, లనురాగమును బొంది యందంద మ్రొక్క
నరవిందభవుఁ జూచి యారమావిభుఁడు, కరుణార్ద్రచిత్తుఁడై కడుఁబ్రీతిఁ బలికె
పరమేష్ఠి నాకు నీప్రజలు ప్రాణములు, కరములు ప్రియమున గదలి నావెనుక
శాశ్వతస్థితి గోరి చనుదెంచినారు, పశ్వాదులును వచ్చె బంధముల్ బాసి
యొగిఁ బుణ్యలోకంబు లొసఁగు నీ వనిన, తగ విచారించి యాధాత చిత్తమున
నొనర నాలోకంబు నుపరిభాగమున, దనరుచునున్న సంతానలోకమున
నిమ్ముల జరియింపనిం డంచుఁ బలికె, సమ్మదం బలర నాజలజసంభవుఁడు
తరుచరాదులతోటి తమమూర్తు లమర, సరి నేగి రయ్యైనిజస్థానములకు