Jump to content

పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పారీణబుద్ధిమై పారలౌకికము, లారసి చూడంగ నఖిలశాస్త్రముల
తండ్రికి సుతుచేత ధర్మంబు గాక, తండ్రిచే సుతునకు ధర్మమె తండ్రి
ధరణి వర్ణాశ్రమధర్మముల్ చెడక, వరుసతో రాజాజ్ఞ వర్తించు గాన
ప్రజలు చేసినయట్టి పాపంబులెల్ల, ప్రజల బాలింపని పతుల బ్రాపించు
కలుగు రాష్ట్రమున కకాలమృత్యువులు, .... .... .... .... .... ....
పుడమిలో రాముఁడు పుణ్యాత్ముఁ డగుట, కడుబొంకు లిట్టివి గాకుండె నేని
బాలుఁడు నాకూర్మిపట్టి యీశిశువు, కాలగోచరుఁడు గా గారణం బేమి
వరసతో నిక్ష్వాకువంశంబురాజు, లిరవొంద నేలి రనేకు లీవసుధ
వినము గానమ యిట్టి విపరీతధర్మ, మనఘులై యారాజు లరయు దేశముల
నని రాము తమ్ముల నవ్వసిష్ఠాది, మునుల నిందింపుచు మొగి నేడ్చుచున్న
నాతెరం గంతయు నారాముఁ డెఱిఁగి, భీతిమై తగువారి బిలువంగఁ బనుప
పరిపాటిమంత్రులు భరతలక్ష్మణులు, వరుసతో నేతేర వాయుదేవుండు
బ్రాతిగా నోలి జాబాలిమాద్గల్య, గౌతమనారదకశ్యపుల్ మఱియు
ఘనులు మార్కండేయకాత్యాయనాది, మునులు వసిష్ఠుండు మొదలుగా వచ్చి
యందంద దీవించి యర్హాసనముల, నందఱు గూర్చుండి రంత నావిభుఁడు
కరుణతో నావిప్ర్రకథ యెఱిఁగింప, నరనాథు గనుగొని నారదుం డనియె
మనుజేంద్ర యీబాలుమరణకారణము, విను మెఱుంగుదు నెల్ల విధము నేర్పఁడగ
విప్రసంపూర్ణమై విశ్రుతాచార, సుప్రసన్నప్రభాశోభితం బగుచు
నాటియై కృతయుగ మది యొప్పుచుండు, లే దనాచారంబు లేశమాత్రంబు
నపమృత్యుశంక లే కాయవుల్ నెరయు, తపము సేయనివాడు ధరలోన లేడు
త్రేతక్షత్రియు లతిస్ధిరతపోమహిమ, నాతతశౌర్యంబులందు నొప్పుదురు
వార లీధర్మవ్యవస్థలు చేసి, ... ... .... .... ..... ..... ..... .....
కోరి పాలించిరి కొలది భూజనుల, నరయంగ నొకపాదమం దధర్మంబు
సమయించె దానిచే సకలభూప్రజల, .... .... .... ..... ..... ..... ...
పలుకుల ననృతంబు పాటిల్లుచుండు, నలఘులై వర్తింతు రఖిలకార్యముల
నరయ న౦దును పెద్దలగువారు బొంకు, బొరయ రుజ్వలతపోభూతి నుండుదురు
ద్వాపరమున నిష్ఠ దగిలి భూసురులు, భూపాలకులు తపంబులు సేయుచుండ
శుశ్రూష లొగి వైశ్యశూద్రులు వారి, కశ్రాంతమును జేయు టదియ ధర్మంబు
సాము బ్రవేశించి జరగంగ పిదప, గోమట్లు దపము గైకొని రటుగాన