పుట:రంగనాథరామాయణము - ఉత్తరకాండ.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మునినాథునకు మ్రొక్కి ముద మొప్ప వచ్చె, దనపర్ణశాలకు దశరథాత్మజుఁడు
నాలోన సీతయు నర్కేందుయశుల, బోలఁగ నిరువుర పుత్రులు గన్న
పరతెంచి యామేలుపల్కు వాల్మీకి, కెఱిగించి మునినాథ యీకుమారకులు

కుశలవులపుట్టుగ శత్రుఘ్నుఁ డెఱుంగుట

రవికులదీపకుల్ రఘురామసుతులు, భువనరక్షకు వీరు పోలంగఁ గలరు
బలసి పిశాచాదిభయము లేకుండ, వలయురక్షలు గట్టవలయు మీ రనిన
లలి వచ్చి కుశయును లవము మంత్రించి, నెలికి నక్కడ నున్న వృద్ధకామినుల
బిలిపించి యీకుశ పెద్దపాపనికి, చెలఁగు నీలవమును చిన్నపాపనికి
పరిమార్జనంబులు పరిపాటి సేయుఁ, డిరవందగాఁ బెంపు డీకుమారకుల
కుశమార్జనంబున కుశలుడై యునికి, కుశుఁ డనగా బెద్దకొడుకు వర్తించు
లవమార్జనంబున లవుడు నాకుశుని, యవరజుం డన నొప్పు నని యెఱింగించి
యభిమంత్రితములైన యాకుశలవము, లభిమతస్థితి నిచ్చె నామునీశ్వరుఁడు
మగుడ వారలు నంగమార్జనస్ధితులు, మొగి జేసినంత నామునివరేణ్యుండు
ధరణిజపేర నాదశరథాధీశు, వరపుత్రుడైన యావసుధీశుపేర
నిరువుర దెసలందునే గడుగోత్రముల, సొరిది జన్మించిన సుతుల నామములు
సంకల్పవిధి జేయ శతృఘ్నుఁ డెఱిగి, ... ... ... ... ... ... .... .... ...
యతిముదంబున బొంది యౌర మాభాగ్య, గతి యంచు గృతకృత్యకర్ముడై వచ్చి
మునినాథునకు భక్తి మ్రొక్కి కేల్మొగిచి, వినయోక్తు లలరంగ వీడ్కొని నడుమ

శతృఘ్నుఁడు యమునాతటంబున విడియుట

రమణీయగతి నేడురాతులు బుచ్చి, యమునాతటంబునఁ కఱిగి యచ్చోట
ననవుఁడు భార్గవుండాదిగాఁ గలుగు, మునులయాశ్రమభూమి ముద మార విడిసి
వారిచే ధర్మార్థవర్తనులైన, వారివృత్తాంతముల్ వరుసతో వినుచు
నవిరళప్రీతిమై నారాత్రి పుచ్చి, చ్యవను నీక్షించి యాశతృఘ్నుఁ డనియె
ననఘాత్మ లవణుని యావిక్రమంబు, కనలు నాతనిచేతి కడిఁదిశూలంబు
చందంబు లెట్టివి సమరోర్వి నాతఁ, డెందఱ సమయించె నెఱిగింపు మనిన
వసుధీశనందన వానిలా వెందు, నసమాన మాశూల మనివార్య మరయ
నతనిశూలముచేత నాజిరంగమున, మృతులైనవారికి మితిమేర గలదె
యైన నేర్పడ విను మవనీశపుత్ర, యేను చెప్పెద నీకు యితిహాసమొకటి