పుట:మార్కండేయపురాణము (మారన).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మునివృత్తి నడవికిఁ జనియెద నందునే జనకుఁడు నన్నేల చనఁగ నిచ్చు?
నుడిగి మడిఁగి మాని యుండెద నందునే నొవ్వనివారికి నవ్వుఁ బట్టుఁ


తే.

బ్రాణములు నాకు నిచ్చినపడఁతిసదుప,కృతికి నేర్తునె ప్రత్యుపకృతి యొనర్ప?
భామినీభోగసౌఖ్యము ల్పరిహరించి, విరతి నొందెదఁ గా కింక వేయు నేల.

43


వ.

అని తలంచి మదాలసకుం దిలోదకప్రదానంబును ననంతరక్రియాకలాపంబును
నిర్వర్తించి ఋతధ్వజుం డెల్ల వారును విన ని ట్లనియె.

44

కువలయాశ్వుఁ డన్యభార్యపరిగ్రహణము సేయనని ప్రతిన పట్టుట

తే.

నాకు నీజన్మమున సుగుణైకభద్ర, యెగుమదాలస యొక్కర్త యాలు గాని
యన్యభార్యాపరిగ్రహ మాచరింప,నింక సత్యంబు పలికితి నే వినుండు.

45


వ.

అని ప్రతిజ్ఞ చేసి ఋతధ్వజుం డంగనావిషయభోగసుఖంబు లన్నియుఁ బరిత్యజించి
తుల్యవయోరూపగుణసంపన్ను లైనసఖులతోడం గూడి క్రీడించుచున్న వాఁ డత
నికి మదాలసం దెచ్చి యిచ్చుటయ పరమకార్యం బది యీశ్వరాదులకుం జేయ
రాదనిన నితరులకు శక్యంబు గామి చెప్ప నేల యనినం గొడుకులకు నశ్వతరుండు
నవ్వుచు ని ట్లనియె.

46


తే.

జనులు మున్న కై పెక్కి యశక్యమని మ, నంబులోపల స్రుక్కి కార్యంబునందుఁ
బూని యుద్యోగ మొనరింప రేని యెట్లు, దానిసఫలతాఫలతలు దారు గండ్రు.

47


క.

తన పౌరుషంబు వదలక, మనుజుఁడు కార్యం బొనర్ప మానుగ దైవం
బునయందుఁ బౌరుషమునం, దును దత్ఫలసిద్ధి దోఁచుఁ దుల్యస్థితితోన్.

48

అశ్వతరుఁడు సరస్వతిని గుఱించి తపము చేయుట

క.

దారువునం దనలంబును, ధారిణిఁ బరమాణువులును దద్దయు నున్న
ట్లారాధనీయమూర్తిని, భారతి! నీయందు నుండు బ్రహ్మము జగమున్.

49


క.

ఆరయ నీ నెల వగునోం, కారము మాత్రాత్రయమునఁ గాదే యుండు
న్భారతి! సదసన్మయ మగు, సారాసారద్వయంబు సంపన్నం బై.

50


వ.

కావునం దత్కార్యంబునకు యత్నంబు సేసెద నని తనయులకుం జెప్పి యప్పుడ
హిమవంతంబున కరిగి యురగేశ్వరుండు ప్లవతరణం బను తీర్థంబునం దపో
యుక్తుండై సకలవాఙ్మయస్వరూప యైనసరస్వతిం దనహృదయకమలంబున నిలిపి
కొని కరకమలంబులు మొగిచి యి ట్లనియె.

51

అశ్వతరునకు సరస్వతి గానప్రావీణ్య మొనఁగుట

వ.

దేవీ! యనిర్దేశ్యస్వభావంబును బ్రణవార్థమాత్రాశ్రితంబును వికారరహితంబును
దాలుదంతోష్ణపుటజిహ్వావ్యాపారదూరంబును సాంఖ్యవేదాంతోక్తంబును నాది
మధ్యాంతరహితంబును నై వెలుంగు పరంజ్యోతి నీస్వరూపం బిట్టి దని నిరూ
పింప నెవరికి శక్యంబు నిత్యంబులు ననిత్యంబులు స్థూలంబులు సూక్ష్యంబులు నైన