పుట:మార్కండేయపురాణము (మారన).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

ఉగ్రవైరివిజయి యొండె మృతుం డొండె, నాజిభూమి నెప్పు డగుఁ దనూజుఁ
డపుడు గర్భదుఃఖ మతివకు సఫలతఁ, బొందు నని తలంతు భూపవర్య.

33


వ.

అని పలికె నంత నన్నరేంద్రుండు గంధర్వరాజనందన నలంకరించి యుచితప్రకా
రంబునం బురంబు వెలువడం గొని చని సంస్కరించి కృతస్నానుం డై కొడుకునకుఁ
గోడలికి నుదకకర్మంబు లాచరించి వీటికిం జనియె నటఁ దాలకేతుండును యమునా
జలంబులు వెలువడి కువలయాశ్వునికడ కరిగి మహాపురుషా! నీవలనం గృతార్థుం
డనైతి నీ విచ్చటం గదల కునికింజేసి మదభిలషితం బంతయు సాధితంబయ్యె
వేంచేయు మనిన నతనికి నమస్కరించి వీడుకొని యక్కుమారుండు.

34


క.

అసమానసౌకుమార్యో, ల్లసితమృదుతనూలతావిలాసమదభరా
లస యై కర మమరుమదా, లసఁ గనుఁగొను నతికుతూహలం బెలరారన్.

35


వ.

కువలయాశ్వంబు నెక్కి రయంబునం జని.

36

కువలయాశ్వుఁడు మదాలసమరణము విని దుఃఖించుట

సీ.

అవగతాలంకార మై యపహృష్టజనావళీవిరళ మై యప్రవర్తి
తాతోద్యవాద్య మై యవ్విధంబున నున్న పురవరంబు కుమారవరుఁడు సొచ్చి
తనరాక కద్భుతంబును నతిమోదంబు నొంది చెలంగుచు నొండొరులను
నెలమి నాలింగనంబులు సేయుచును బ్రీతిఁ జేరి దీవింపుచుఁ బౌరు లెల్లఁ


తే.

బొదివికొని రాఁగ మందిరంబునకుఁ జనిన, దల్లిదండ్రులు సకలబాంధవులు నధిక
హర్షవిస్మయమగ్ను లై యతనిఁ జక్కఁ, గౌఁగిలించి రాశీర్వచఃకలితు లగుచు.

37


వ.

అక్కుమారుండు వారలసంభ్రమచేష్టితంబులు చూచి విస్మితుం డగుచుఁ దండ్రికి
మ్రొక్కి యది యేమి యని యడిగిన నతండు గొడుకున కంతవృత్తాంతంబునుం
దేటపడం జెప్పుటయును.

38


చ.

చెవులకు శూల మై యెదకుఁ జి చ్చయి తాఁకి మదాలసామృతి
శ్రవణము వేదనం బెనుప రాజకుమారుఁడు తల్లిదండ్రు లొ
ద్ద విపులశోకలజ్జలకుఁ దావల మై వదనంబు వ్రాల్చి ని
ల్చె వెఱఁగుపాటు నొంది కడుఁజేష్ట యడంగి విషణ్ణమూర్తి యై.

39


వ.

అటు నిలిచి యంతర్గతంబున.

40


క.

ఆవెలఁదుక నామృతి విని, జీవము వెసఁ దొఱఁగి చనియెఁ జేడియమరణం
బే వినియు నున్నవాఁడను, జీవముతో నింతకఠినచిత్తుఁడు గలఁడే?

41


వ.

అనుచు నందంద నిట్టూర్పులు సందడింప డెందంబు గొందలంబు నొంద నన్నరేంద్ర
నందనుండు వెండియు.

42


సీ.

ఎలనాగఁ బేర్కొని యేడ్చెద నందునే మముబోంట్లకును నిది మానహాని
పడఁతి కిచ్చెదఁ దనుప్రాణంబు లందు నేఁ దనువు ప్రాణంబులు తండ్రిసొమ్ము