పుట:మార్కండేయపురాణము (మారన).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని చెప్పి కుండల వెండియు.

308


ఉ.

అక్కట యీలతాంగి హృదయంబున నీదెస కూర్మి యెంత యు
న్నెక్కొని యున్న దాసురభి నిక్కము రక్కసు నేసినట్టివాఁ
డిక్కమలాక్షిభర్త యని యేర్పడఁ జెప్పెఁ గుమార దైవ మీ
చిక్కులఁ బెట్టి నెవ్వగలఁ జేడ్పడఁ జేయఁ దలంచెనో సఖిన్.

309


తే.

కాంత పుట్టినకోలె దుఃఖములె గుడిచె, దీనికి వివాహ మయినఁ బృథ్వీతలేంద్ర
మరణ మయినట్టిపతిని గ్రమ్మఱను బొంద, నలయ కే నుగ్ర మగుతప మాచరింతు.

310

కుండలతోఁ గువలయాశ్వుఁడు దనవృత్తాంతముఁ జెప్పుట

సీ.

అని చెప్పి కుండల యనఘ నీ వెవ్వండ వేప్రయోజనమున కిందు రాక
గీర్వాణదైత్యగంధర్వచారణకిన్నరోరగపతులలో నొక్కరుండ
వే మానుషాగతి నిట వచ్చి తీమూర్తి మానుషి యన రాదు మాకుఁ జెపుమ
నావుడు శత్రుజిన్నరనాథపుత్త్రుఁడ జనకుపంపున మునిజనులఁ గావ


ఆ.

నరుగుదెంచి గాలవాశ్రమంబున నుండ, నసుర యొకఁడు పంది యై రయమున
వచ్చి యర్ధచంద్రవత్సాయకమున నా, చేత నొచ్చి తిరిగి భీతి నొంది.

311


ఆ.

హయము దోలుకొని రయంబున నే వెను, కొనఁగ నెట్లొ పఱచి క్రోడ మొక్క
బొఱియఁ జొచ్చి యతలమునకు డిగ్గుటయును, దోన జొచ్చి దానిఁ గాన కిచట.

312


వ.

సాంద్రతమఃపుంజంబునం బరిభ్రమించుచు వచ్చి తేజోవిరాజితంబు నిష్పురు
షంబు నైనయిప్పురంబుఁ జొచ్చి నిన్నుం గని నేను బిలిచిన నదత్తప్రతివచన వైన
నీవెనుకన చనుదెంచి యీహర్మ్యతలం బెక్కితి నిది యిట్టిద కాని.

313


క.

విను కుండల నీ చెప్పిన, యనిమిషముఖ్యప్రవరులయం దెవ్వఁడఁ గా
ననుమాన ముడుగు మనుజుఁడ,ననిమిషముఖు లెల్లఁ బూజ్యు లనిశము నాకున్.

314


చ.

అన విని యమ్మదాలస సహర్షసలజ్జసవిస్మయేక్షణం
బు నిగుడ నిశ్చలత్వమునఁ బొంది ముఖాబ్జము చూచుచుండె న
చ్చిన కృపపెంపున న్సురభి చెప్పినయంతయు నిట్లు నిక్క మై
యెనరిన దైవలీల యొకఁ డోపునె త్రోవఁగ నెందుఁ గుండలా.

315


వ.

అని పలికె నంతఁ గుండల కువలయాశ్వుం జూచి.

316


మ.

ధరణీనాథకుమార! యాసురభిచేత న్విన్న ధన్యుం డ వీ
వరయంగా నగు దీలతాంగి మది యన్యాసంగి గా నేర్చు నే
యొరుఁ డుద్యద్భుజవిక్రమోజ్జ్వలుఁడె నీ వొక్కండునుం దక్క ని
ర్భరలీల న్శరవిద్ధుఁ జేసి యెగువ న్బాతాళకేతు న్మహిన్.

317


ఉ.

కావున నర్కుదీప్తి శశిఁగాంతి గుణాఢ్యుని భూతి వొందున
ట్లీవనజాయతాక్షి నిను నిం పెసలారఁగఁ బొంది యుత్సవ
శ్రీ విలసిల్లునట్లుగ వరింపుము సద్విధిపూర్వకంబుగా
నావుడు రాజసూనుఁ డెలనవ్వు మొగంబు నలంకరింపఁగన్.

318