పుట:మార్కండేయపురాణము (మారన).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గావింప సమర్థుండ నయ్యును దపోవ్యయంబున కోర్వక యేను దుఃఖించి నభంబు
చూచి నిట్టూర్పు నిగిడించిన నయ్యంబరతలమునుండి వచ్చి యీయశ్వంబు నాయె
దుర నిలువంబడిన నాకాశవాణి యి ట్లనియె.

279


చ.

రవి యొసఁగె న్మునీశ్వర! తురంగము నీ కిది సత్త్వసంపద
న్గువలయ మెల్ల వ్రేల్మిడిన గ్రుమ్మరు నీళులఁ బర్వతంబుల
న్దివి నతలంబున న్సకలదిక్కులఁ జెక్కు సెమర్ప కెందునుం
దవు లొక యింత లేక సతతంబుఁ జరించు సముల్లసద్గతిన్.

280


వ.

కువలయసంచారసామర్థ్యంబునం జేసి.

281


ఆ.

కువలయం బనంగఁ గువలయంబున నతి, ఖ్యాతి నమరునీహయంబు నెక్కి
మునివరేణ్య! నిన్ను ననిశము గారించు, కిల్బిషాత్ము నసురఁ గీటడంచు.

282


క.

ఘనుఁ డైనశత్రుజిన్నృపు, తనయుండు ఋతధ్వజుండు తడయక దీని
న్గొని చని విక్రమతేజో, ధనుఁ డగునాతనికి నిమ్ము తద్దయు నెమ్మిన్.

283


వ.

అని చెప్పిన హర్షించి యీ తురంగరత్నంబు దెచ్చి నీకు నివేదించితి నాతపంబునకు
విఘ్నం బొనరించునక్తంచరు సమయించుటకై కుమారుని నియోగించి ధర్మ
రక్షణం బాచరింపుమనవుడు నన్నరేంద్రుం డమ్మునివచనం బాచరించి.

284


తే.

పరమకౌతుకమంగళస్ఫురితుఁ బుత్త్రు, నత్తురంగంబు నెక్కించి యనిచి పుచ్చె
నమ్మునీంద్రునితోఁగూడ నతఁడు నక్కు, మారుఁ దోడ్కొని తనయాశ్రమమున కరిగె.

285

వరాహముం దఱుముచుఁ గువలయాశ్వుండు బిలముఁ జొచ్చుట

క.

అనిన భుజగేంద్రుఁ డి ట్లను, జననాథకుమారుఁ డట్లు చని యేమి యెన
ర్చెను నటఁ జెపుఁ డేతత్కథ, విన విస్మయ మనుడు నురగవిభునకుఁ బుత్త్రుల్.

286


చ.

అనుపమశౌర్యుఁ డాకువలయాశ్వకుమారుఁడు గాలవాశ్రమం
బునఁ గలసంయమీశ్వరులఁ బొల్పుగఁ గాచుచు సర్వవిఘ్నశాం
తినిపుణుఁ డై యజస్రము నతిప్రమదంబున నుండె నున్న య
జ్జనపతిపుత్రు గాలవునిఁ జంపఁ గడంగి మదంబుసొంపునన్.

287


సీ.

రాక్షసుఁ డుగ్రవరాహరూపము దాల్చి ఘురఘురధ్వనుల నంబరము వగులఁ
గన్నుల విస్ఫులింగములు రాలంగను జరణఘట్టనమున ధరణి వణఁకఁ
జనుదేర మునిశిష్యసమితి గనుంగొని యాక్రోశ మొనరించి రన్నరేంద్రు
సుతుఁడు బాణాసనస్ఫురితపాణియు హయారూఢుఁడు నై కడుఁ గ్రూర మైన


తే.

యర్ధచంద్రబాణము గొని యతిరయమునఁ, గదిసి యప్పంది నేసిన నదియు నొచ్చి
తిరిగి భయమున వనములు గిరులు గడచి, చనఁ దొడంగె నవ్వీరుఁడు వెనుకొనంగ.

288


వ.

అట్లు సహస్రయోజనంబులు చని యవ్వరాహంబు తిమిరపటలపరివృతం బైనభూ
వివరంబునం బాతాళంబునకు దిగంబడినం గువలయాశ్వుండును వెనుకన యత