పుట:మార్కండేయపురాణము (మారన).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డంతశ్శుద్ధుఁడ వీ వసంగుడవు విద్యావిస్ఫురస్ఫూర్తి వీ
కాంతారత్నము పద్మవాస త్రిజగత్కళ్యాణి యోగీశ్వరా.

244


క.

నీ వరయఁగ విష్ణుండవు, నావుడు ముని సంతసిల్లి నాతత్త్వము స
ద్భావమున నెఱిఁగి కొలిచితి, గావున వర మిత్తు నడుగు కామ్యయశోర్థీ!

245


మ.

అనిన న్పమ్మద మంది యర్జునుఁడు వేహస్తంబులు న్భూమిపా
లనసామర్థ్యము ఘోరసంగరజయోల్లాసంబు నిష్టార్థము
ల్దనుఁ బేర్కొన్న జనాళి గాంచుటయు సద్ధర్త్మైకతాత్పర్యము
న్ఘనసామ్రాజ్యమహావిభూతియును వేడ్క న్వేఁడె నాసంయమిన్!

246


వ.

మఱియు శైలాకాశజలభూమిపాతాళంబులయందు మదీయరథగతి యకుంఠిత గావ
లయు ననవుడు నమ్మహాయోగీంద్రుం డతనికి నవ్వరంబు లన్నియు నొసంగి మత్ప్ర
సాదంబునం జక్రవర్తిత్వంబు నొందుమని యనుగ్రహించినం గృతార్థుం డై సహస్ర
బాహుం డమ్మునీంద్రునకు నమస్కరించి వీడ్కొని నిజపురంబునకుం జని రాజ్యాభి
షేకమాంగళ్యంబు నంగీకరించి దత్తాత్రేయప్రసాదంబున నభివృద్ధి నొంది భుజ
బలైశ్వర్యసంపన్నుండ నై వచ్చితి నేను దక్క నెవ్వఁ డాయుధంబులు ధరియించి
నను వాఁడు దస్యుండునుంబోలె నాచేత వధ్యుం డగు నని చాటించినం దదీయ
రాష్ట్రంబునం దొక్కరుండును శస్త్రహస్తుండు లే కుండె నంత.

247


ఆ.

భూమిపాలకుండు గ్రామపాలకుఁడు గో, పాలకుండు విప్రపాలకుండు
క్షేత్రపాలకుఁడు నశేషతపోధన, పాలకుండు నగుచుఁ బార్థివుండు.

248


క.

బహుయజ్ఞంబులు సేయుచు, మహనీయాహవవిహార మహితుం డగుచు
న్విహితతపం బొనరించుచు, సహస్రబాహార్జునుఁడు ప్రజాపాలనమున్.

249


వ.

చేయుచున్న నతనియత్యంతసమృద్ధిఁ జూచి యాంగిరసుం డనుమునివరుండు.

250


క.

నానాయజ్ఞంబుల బహు, దానంబుల సతతభూరితపముల రణకే
ళీనైపుణముల నర్జును, నేనృపతులు పోల నేర్తురే! యని పొగడెన్.

251


క.

ఏదినమున వరము వడసె, నాదత్తాత్రేయుచేత నానరనాథుం
డాదినమునఁ దత్పూజన, మాదరమునఁ జేయుఁ దాను నవనీజనులున్.

252


వ.

అని చెప్పి జడుండు తండ్రీ! దత్తాత్రేయుజన్మప్రకారంబును దదీయమాహాత్మ్యం
బును జెప్పితి నింక నలర్కుండు పుట్టినవిధంబును రాజర్షి యైనయమ్మహాత్మునికి
నయ్యోగీంద్రుండు చెప్పినయోగంబును జెప్పెద నాకర్ణింపుము.

253

అలర్కచరిత్రము—ఋతధ్వజుఁ డను నామాంతరముగల కువలయాశ్వునివృత్తాంత మారంభించుట

తే.

శక్రుఁ డెవ్వఁడు సేయుయజ్ఞముల సోమ, పాన మొనరించి సంతోషభరితుఁ డయ్యె
నట్టిశత్రుజిన్నామధరాధినాథు, సుతుఁడు సద్గుణయుతుఁడు విశ్రుతయశుండు.

254


క.

లావణ్యాశ్విసమానుఁడు, దీవిభవామరగురుండు దీపితభుజశౌ