పుట:మార్కండేయపురాణము (మారన).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్థారంభుల మైతి మనుచు, నారక్కసు లంగజార్తు లై యాలక్ష్మిన్.

233


ఆ.

పట్టి శిబికమీఁదఁ బెట్టి శిరంబుల, మోచికొని చనంగ మునివరుండు
సురలఁ జూచి నగుచు సిరి దానవులతల, కెక్కె వృద్ధిఁ బొందుఁ డింక మీరు.

234


వ.

అది యె ట్లనిన వినుండు.

235

లక్ష్మీనివాసస్థానఫలవివరణము

క.

మేనం బురుషునిసప్త, స్థానంబులు గడచి తలకుఁ జని సిరి విడుచు
న్వాని ననిన ననిమిషు లా, స్థానమ్ములు దత్ఫలములు జననుత! చెపుమా.

236


వ.

అని యడిగిన నమ్మునివరుండు.

237


సీ.

పురుషునిపదములఁ బొంది యిందిర శుభమందిరస్థితి కటిమండలమున
నుండి మాణిక్యవస్త్రోన్నతత్వము గుహ్యమునఁ జెంది భార్యాప్రమోదలీల
క్రోడాంగమున నెలకొని సుతబహువృద్ధి హృదయంబు నొంది యభీష్టసిద్ధి
గళమున వసియించి కంఠభూషణలబ్ధి వదనాబ్జమున నిల్చి మృదుతరాన్న


తే.

మంజువాక్యకవిత్వసమగ్రశాంతి, మహిమ గలుగంగఁ జేయుఁ దా మస్తకమున
కరిగెనేని రయంబున నతని విడిచి, యతిముదంబున నన్యుని నాశ్రయించు.

238


వ.

కావున శిరోగత యగుటం జేసి లక్ష్మి యద్దానవులం బరిత్యజించెఁ బరదారాభిలాషం
బున దగ్ధపుణ్యు లైనయద్దురాతుల నేను తేజోబలైశ్వర్యహీనులం గావించితి
మీరు భయంబు దక్కి యారక్కసుల నుక్కడంపుఁ డనుటయు.

239


ఆ.

సురలు చెలఁగి యేయుసునిశితశరముల, జంభముఖనిలింపశత్త్రుకోటి
సమసె లక్ష్మి యెగసి చనుదెంచి యాత్రేయు, నొందె హర్షలీల నొంది యపుడు.

240


క.

అమరేంద్రాద్యమరులు స, ప్రమదు లగుచు నమ్మునీంద్రుఁ బ్రస్తుతులఁ బ్రణా
మముల నలరించి వైభవ, మమరఁగ నాకమున కరిగి రవనీనాథా!

241


క.

అమరేంద్రునట్లు నీవును, నమలినతరభక్తియుక్తి నాదత్తాత్రే
యమునీంద్రుఁ గొల్చి భూవర!, యమితైశ్వర్యంబు వడయు మని చెప్పుటయున్.

242

కార్తవీర్యుఁడు దత్తాత్రేయు సేవించి యిష్టార్థములఁ బడయుట

వ.

గర్గునివచనంబులు విని కార్తవీర్యుం డయ్యోగీంద్రుకడ కరిగి నమస్కరించి యను
దినంబును బాదసంవాహనంబులను మద్యమాంసవివిధాహారసమర్పణంబులను
జందనకర్పూరకస్తూరికాదిసమస్తవస్తుప్రదానంబులను దదుచ్చిష్టావసేవనంబులను
నతనిచిత్తంబు గృపాయత్తంబుగా నారాధించుచుండ నమ్మునివరుండు దనయ
పానపవనజనితం బగుననలంబున నమ్మహీభుజభుజద్వయంబు దగ్ధంబు గావించిన
మఱియు నతం డత్యంతభక్తిం బరిచర్య యొనర్చుచుండం గనుంగొని యి ట్లనియె.

243


శా.

కాంతాసక్తుఁడ మద్యపానరతుఁడం గష్టప్రచారుండ న
త్యంతప్రీతి భజించె దేమిటికి న న్నన్న న్మహీనాయకుం