పుట:మార్కండేయపురాణము (మారన).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవతలకు దత్తాత్రేయునకు నైనసంవాదము

సీ.

అనుడు దివౌకసు లతిరయంబున నేఁగి కిన్నరగంధర్వగీయమాను
లక్ష్మీసమన్వితు లలితాంగుఁ దేజస్సముజ్జ్వలు నమ్మహాయోగిఁ గాంచి
యతిభక్తితో మ్రొక్కి యాసవతోయాదు లడిగిన నిచ్చుచు నమ్మహత్ముఁ
డరిగినతోడనే యరుగుచు నిలిచినయెడఁ దారు నిలుచుచు నెలమి మిగుల


ఆ.

ననుదినంబుఁ దగిలి యారాధనము సేయ, నమరవరులఁ జూచి యతఁడు నన్ను
నేమి గోరి మీర లిట్లు సేవించెద, రనిన వార లిట్టు లనిరి ప్రీతి.

223


చ.

బలువిడి మూఁడులోకములు బాహుబలంబున జంభుఁ డాదిగాఁ
గలదితినందను ల్గొనిన గర్వ మడంగి భవత్పదాంబుజం
బులు గొలువంగ వచ్చితిమి భూరిగుణాకర! యమ్మహాసురా
వలిఁ బొలియించి మాకుఁ ద్రిదివస్థితిఁ గ్రమ్మఱఁ జేయవే దయన్.

224


వ.

అనిన దత్తాత్రేయుం డిట్లనియె.

225


శా.

మద్యాసక్తుఁడ నంగనారతుఁడఁ గర్మభ్రంశనోచ్చిష్టుఁడ
న్మాద్యద్దైత్యవినాశశక్తి గలదే నా? కన్న నద్దేవత
ల్విద్యాక్షాళనశుద్ధమానసుఁడ వావిష్ణుండ వాద్యుండ వీ
యుద్యత్పుణ్యచరిత్ర యిందిర మహాయోగీంద్రచూడామణీ!

226


వ.

నీవు సత్యజ్ఞానానందస్వరూపుండవు నీకు విధినిషేధంబు లెక్కడివి? యనిన నమ్మ
హాయోగి నగుచు నది యట్టిద మీరు నాయున్నరూ పెఱింగి యారాధించితిరి.
భవదభిమతం బిప్పుడ యొనరించెద దానవులు నెలయించికొని రం డద్దురాతులు
మదీయదృష్టిపాతంబున నవగతప్రాభవులై నశింతు రనిన నాదిత్యు లత్యంతరయం
బునం జని దైత్యులం బోరికిఁ బిలిచిన.

227


క.

చెలఁగుచు భుజబలదర్పో, జ్జ్వలు లై తలపడిన రాక్షసప్రవరుల కో
ల్తల కోహటించి దేవత, లలజడిఁ జని రత్రిపుత్త్రునాశ్రమమునకున్.

228


తే.

అవ్విధంబున నని నోడి యధికభీతిఁ, జనిన దివిజుల వెనుకొని దనుజు లరిగి
కనిరి మదిరామదాలసు ననుపమాన, దివ్యతేజు దత్తాత్రేయు భవ్యమూర్తి.

229


వ.

కాని మఱియును.

230

దైత్యులు దత్తాత్రేయదారాపహరణంబున నశించుట

ఉ.

ఆముని వామపార్శ్వమున యందు వెలుంగుచునున్న లక్ష్మిఁ ద
ద్భామిని నిందుబింబముఖఁ బద్మవిలోచనఁ జారుభూషణ
శ్రీమహిమాభిరామఁ గని చిత్తజబాణవిభిన్నచిత్తు లై
ప్రేమ మెలర్ప దైత్యులు హరింపఁగఁ గోరిరి దాని నందఱున్.

231


వ.

అట్లు కోరి దనుజు లద్దివిజులవెనుకం జనక నిలిచి.

232


క.

స్త్రీరత్నంబు త్రిలోకీ,సారం బిది మనకు నిపుడు సమకూరెఁ గృతా