పుట:మార్కండేయపురాణము (మారన).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దత్తాత్రేయుం డనఁ బురు, షోత్తముఁ డనసూయ కర్థి నుదయం బయ్యెన్
జిత్తం బలరఁగ సత్తా, యత్తుఁడు యోగియును దైత్యహరతేజుఁడు నై.

201


వ.

తదనంతరంబ హైహయుం డనురా జనసూయాగర్భనిరోధంబు గావించిన నెఱింగి
వాని నిర్ధగ్ధుం జేయం దలంచి దుఃఖామర్షసమన్వితుం డగుచు గర్భావాసంబున నేడు
దినంబు లుండి దుర్వాసుం డను నామంబున రుద్రుండు తమోగుణోద్రిక్తుం డై యవ
తరించి తల్లిదండ్రులం బరిత్యజించి యున్మత్తాఖ్యం బగునుత్తమవ్రతంబు ధరియించి
ధరిత్రిం బరిభ్రమించుచుండె నివ్విధంబున నత్రికళత్రంబు పురుషత్రయాంశంబు
లైనపుత్రులం బడసి కృతార్థత్వంబు నొందె నంతం బరమయోగి యైనదత్తా
త్రేయుండు.

202

దత్తాత్రేయుని తపశ్చర్యాదిమహిమ

.

క.

అనిశంబు మునికుమారులు, దనుఁ బరివేష్టించి తిగుగఁ దా నిస్సంగ
త్వనిరూఢిఁ గోరి చని యొక, వనజాకరమున మునింగె వా రరుగుటకై.

203


తే.

అట్లు మునిఁగినఁ గనుఁగొని యక్కు మారు, లతని విడిచి పోఁజాలక యర్థితోడ
దివ్యశతహాయనములు దత్తీరభూమి, నుండి రుండిన నెఱిఁగి యయ్యోగివరుఁడు.

204


శా.

ఏణీలోచనఁ బూర్ణచంద్రవదన న్హేమప్రభాంగిన్ ఘన
శ్రోణీమండలఁ బీనబంధురకుచ న్రోలంబపుంజోల్లస
ద్వేణిం బల్లవకోమలాంఘ్రయుగళ దివ్యాంగన న్లోకక
ళ్యాణిం గైకొని యప్పయోరుహవనం బయ్ోయగి లీలాగతిన్.

205


క.

వెలువడియెఁ గామినీజన, కలితుం డగుతన్నుఁ జూచి కడు రోసి కుమా
రులు విడిచి పోదు రనియెడు, తలఁపున నట్లైన వారు దను విడువమికిన్.

206


వ.

మఱియు నయ్యోగీశ్వరుండు.

207


ఉ.

ఆలలితాంగి నర్థిఁ దనయంకతలంబున నుంచి కామలీ
లాలసభావుఁ డై తగిలి యాసవ మాదటఁ దాను నింతియు
న్గ్రోలుచు నట్టె పాడుచును గూరినభూరిమదంబుసొంపునం
దేలుచు నున్నఁ జూచి ముని దేవకుమారులు రోసి క్రక్కునన్.

208


క.

ఆయోగీశ్వరుని విడిచి, పోయిరి మూఢు లయి వినుము పుణ్యులు యోగ
శ్రీయుతులు వారలకు సరి, యై యుండును హవ్యసేవనాసవసేవల్.

209


క.

ఆడుట పాడుట పడఁతులఁ, గూడుట యాసవరసంబు గ్రోలుట యోగ
క్రీడలు గావున యోగుల, నేడిరవులఁ జేర వఘము లేక్రియ నున్నన్.

210


క.

అనిలుఁడు చండాలస్ప, ర్శనమున విను మశుచి గానిచందంబున యో
గనిపుణుఁ డస్పృశ్యస్ప, ర్శనమునఁ దా నశుచి గాఁ డసంగుం డగుటన్.

211


వ.

కావున నమ్మహాయోగి యయ్యంగనయుం దానును మదిరారసం బానుచు మోక్ష
కాంక్షులగు యోగిజనులచేత విచింత్యమానుం డగుచు నాంతరం బగుతపం బాచ