Jump to content

పుట:మార్కండేయపురాణము (మారన).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

అంత నాదైత్యపతి ప్రియకాంత యయిన, మేనకాత్మజ మదనిక మిక్కుటంపు
భీతి నీభార్య నయ్యెదఁ బ్రీతి నాకు, శరణ మగుమన్న నగుచుఁ గందరుఁడు వొంగి.

40


వ.

ఆసుందరిం దోడ్కొని చని నిజమందిరంబున కరిగె నంత నిజేచ్ఛానురూపరూప
ధారిణియగుటం జేసి.

41

కందరునివలన విద్యుద్రూపపత్నియగు మదనికయందు వపువు జనించుట

క.

ఆధవళవిలోచన పులుఁ, గై ధవునిం బ్రీతుఁ జేసె నాదుర్వాసః
క్రోధానలమున నెరిసిన, యాధవళాబ్జాక్షి పుత్త్రియై జనియించెన్.

42


వ.

దానికిఁ గందరుఁడు తార్క్షి యనునామం బొనరించె నంత.

43


క.

పరమముని మందపాలుఁడు, జరితారిప్రముఖు లైనశార్ఙ్గేయుల న
ల్వురఁ బడసె సుతుల నం దు, ద్ధురగుణుఁ డగుపిన్నకొడుకు ద్రోణుఁడు దార్క్షిన్.

44


వ.

ధర్మపత్నిగ నంగీకరించె నవ్విహంగాంగనయుఁ గతిపయకాలంబునకు గర్భిణియై
మూఁడునెలలపదియేనుదివసంబులు చన్నసమయంబునం బాండవకౌరవులు
భండనం బొనరించుచున్న నొక్కనాఁడు విధివశంబునం గురుక్షేత్రంబున కరిగి
నిరంతరనిశితవివిధవిశిఖపరిచ్ఛన్నాంబరం బైనయమ్మహాయుద్ధమధ్యంబునం బరిభ్ర
మించుచున్నంత.

45

భారతయుద్ధమునఁ దార్క్షి కడుపు దెగి గ్రుడ్లు పడుట

సీ.

భగదత్తుగజముపై ఫల్గునుం డేసిన పటుభల్లమునఁ జేసి పక్షివనిత
కడుపుతో ల్ద్రెవ్వినఁ గర్భచ్యుతంబులై కమనీయశశిబింబకాంతి నొప్పు
నండము ల్నాలు గొయ్యన సాంద్రతద్రక్తపంకముపై దూదిఁ బడువడువునఁ
బడినతోడనె తెగిపడి సుప్రతీకంబు పార్శ్వమహాఘంట పటురయమున


తే.

భవన మయ్యెను వానికి భాగ్యమహిమఁ, బతగియును నంత దివ్యరూపమునఁ జనియె
భారతాజి చెల్లినఁ గురుప్రభుఁడు భీష్ము, పాల సకలధర్మములు తత్పరత వినఁగ.

46

ధర్మపక్షులయొద్దకు శమీకముని వచ్చి వారం బెంపఁ గొనిపోవుట

వ.

అయ్యెడకు శమీకుం డనుముని శిష్యసమేతుం డై వచ్చి.

47


క.

జిలిబిలియెలుఁగులు ఘంటా, నిలయములోఁ జెలఁగుటయు మునిప్రభుఁ డచ్చో
నిలిచి చెవి యెడ్డి విని శి, ష్యులు దానుం బట్టి గంట యొయ్యన నెత్తెన్.

48


వ.

అట్లెత్తి.

49


తే.

అమరు రేయెండపిండుల కవయవములు, మొలచినట్లు తేజస్ఫూర్తి వెలుఁగుచున్న
విహగశిశువుల విజ్ఞానవిమలమతులఁ, గని మునీంద్రుఁడు విస్మయమున మునింగి.

50


క.

అక్కట! యీసమరతలం, బెక్కడ? నీయండజంబు లెక్కడ? నీపా
టెక్కడ? నీఘంటాశ్రయ, మెక్కడ? దైవంబుఘటన యే మన వచ్చున్?

51


వ.

అని శిష్యులం జూచి తొల్లి యాదిత్యులకు నోడి దైత్యులు మరణభయంబునఁ
బాఱిన భార్గవుండు వారల నుద్దేశించి చెప్పిన వాక్యంబులు వినుండు.

52