పుట:మార్కండేయపురాణము (మారన).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అనుఁడు మృకండుసూనుఁడు మహాత్మ! పితామహుచేత నమ్మరు
త్తనృపతి వేడ్క పెంపెసఁగఁ దా పృథురాజ్యపదస్థుఁ డై మహీ
జనములఁ గాచుచు న్సవనసంపద నొందుచు నెల్లదీవులం
దనఘనచక్ర మప్రతిహతం బగుచుండఁగ నత్యుదగ్రతన్.

223


క.

తనరథగతి యాకాశం, బున బాతాళమున నుదకములయందును నెం
దు నకుంఠిత మై మెఱయఁగ, ననఘుండు మరుత్తుఁ డేలె నఖిలావనియున్.

224


తే.

ఇతరవర్ణులు నమ్మేదినీశువలన, నధికధనములు వడసి నిరంతరంబు
నాస్థతో నిష్టపూర్తము లాదిగాఁగఁ, గలుగుధర్మము ల్సేసిరి గారవమున.

225


సీ.

ఆంగిరసుండు బృహస్పతితోఁబుట్టు వతులతపోవిభవాధికుండు
సంవర్తుఁ డనియెడుసంయమి తనకు ఋత్విజుఁ డయి ముంజవద్దివ్యనగము
శిఖరంబు నిజశక్తి క్షితిఁ బడఁ జేసి యందపరిమితం బైనయర్థసంచ
యమ్ముఁ జూపినఁ గొని యమ్మరుత్తుఁడు హేమకుట్టిమస్థలములఁ గొమరు మిగుల


తే.

హర్మ్యశాలాదినానాగృహముల బహువి, ధోపకరణములను మహాయూపములను
గనకమయములఁ గావించి క్రతువు లోలిఁ, జెసి దివిజులఁ దృప్తులఁ జేసె నర్థి.

226


వ.

ఇట్లు మరుత్తుండు సోమంబున నింద్రాదిదేవతలను సమగ్రదక్షిణల మహీదేవత
లను దృప్తి నొందించి సువర్ణమయంబు లగుప్రాసాదాదిసమస్తవస్తువులను
బ్రాహ్మణుల కొసంగి మహోత్కృష్టుం డై మహీపాలనంబు సేయుచుండ నొక
తపోధనుండు చనుదెంచి యానరపతిం గాంచి యేను భవత్పితామహికడనుండి
వచ్చితి నాయవ్వ నీకుం జెప్పు మనిన వాక్యంబు లాకర్ణింపుము.

227

మరుత్తునితో ముని చెప్పిన నాయనమ్మసందేశము

ఆ.

ధరణి ధర్మయుక్తిఁ దగఁగఁ బాలించి నీ, తాత చనియె దివిజధామమునకుఁ
దపము సేయుచున్నదాన నౌర్వాశ్రమ, స్థలమునందు శాంతి దనర నేను.

228


తే.

పుడమి పాలించి చనినమీపూర్వనృపుల, యందు ము న్నేతరమ్మున నైన నుర్వి
కెన్నఁడును బుట్ట దేకీడు నెచట నకట!, నీతరంబున నొకకీడు నేఁడు పుట్టె.

229


క.

సురుచిరభోగాసక్తిం, బొరసియొ సతతాధ్వరేచ్ఛ పొందియొ యకటా!
చరనరనాథుఁడవై నీ, వరయవు దుష్టులు నదుష్టు లగువారి నిలన్.

230


వ.

అది యెట్లంటేని.

231


సీ.

అధికదర్పోన్నతి నహిలోకముననుండి చనుదెంచి ఘోరభుజంగమములు
మునుల వినిర్మలమూర్తుల నేడ్వురఁ గఱచి వేగమ మృత్యుగతులఁ జేసి
విలసజ్జలాశయములు నిజస్వేదమూత్రపురీషముల దూషితములు సేసిఁ
గడఁగి హవిస్సులు గాసి చేసిన వాని సమయింప సంయము ల్శక్తులైన