పుట:మార్కండేయపురాణము (మారన).pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

తివుట నొక్కొక్కమాటు పద్మినులపొంత, నర్థి నొక్కొక్కమాటు గుహాంతరములఁ
బ్రీతి నొక్కొక్కమాటు కృత్రిమనగముల, బహువినోదము ల్సలిపిరి పతియు సతియు.

194


క.

అడిసిగ్గులు తమకంబులు, నుడి వోవఁగఁ గేలికడఁక లొదవఁగఁ జెయువు
ల్దడఁబడ మలుపులు దెలుపులు, నడరి రతిక్రీడ సలిపి రతివయుఁ బతియున్.

195


క.

కిన్నరగంధర్వులు రుచి, రాన్నప్రశ్చందనాంబరాభరణాదు
ల్పన్నుగఁ దమ కొసఁగఁగ సం, పన్నము లగుభోగములకుఁ బాత్రము లగుచున్.

196


వ.

కరంధమరాజనందనుండు గంధర్వరాజనందనయు నిట్లు మనోహరము లగుమనో
భవవిహారముల సుఖయించుచుండి రంతఁ గొంతకాలంబునకు.

మరుత్తుజననము

క.

గంధర్వరాజనందన, సంధుక్షితతేజుఁ బ్రబలు సత్సుతుఁ గనిన
న్గంధర్వలోక ముత్సవ, బంధుర మై యొప్పె నభము ప్రవిమల మయ్యెన్.

198


సీ.

ఎలమి నవేక్షితుఁ డెంతయు రంజిల్లెఁ గిన్నరగంధర్వగీతతతులు
పణవవీణావేణుపటహమృదంగానేకాదినాదంబులు నతిశయిల్లె
నప్సరోవనితలయాటలు విలసిల్లె వెసఁ బుష్పవర్షంబు విస్తరిల్లె
నవిరళమృదుగంధపవనంబు శోభిల్లె దిక్కులన్నియుఁ గడుఁ దేజరిల్లె


తే.

నపుడు గంధర్వనగర మత్యంతరమ్య, మయ్యె సురసిద్ధసాధ్యవిద్యాధరాహి
గరుడఖేచరయక్షకింపురుషవరుల, సంకులమ్మున సంయమిసంకులమున.

199


వ.

అట్టిసమయంబునఁ దుంబురుం డాబాలునికి జాతకర్మహోమాదిసముచితక్రియా
కలాపంబు నిర్వర్తించి స్వస్తివచనపూర్వకంబుగా నిట్లని స్తుతియించె.

200


క.

నీవు మహనీయుఁడవు తే, జోవీర్యధనుండ వురుయశుండవు భూభృ
ద్దేవుఁడవు చక్రవర్తివి, శ్రీవిలసితుఁడవు కుమార జితరిపువీరా!

201


క.

శతమఖముఖనిఖిలసుర, ప్రతిపక్షనిరాసనిపుణ! భవదీయభుజా
తతబలశౌర్యంబులు ప్ర, స్తుతించెదరు వివిధయజ్ఞసుకృతప్రవణా!

202


వ.

అని మఱియును రజోరహితంబుగా నల్లన వీచుచున్న ప్రాఙ్మరుత్తు నీకు శుభంబును
దక్షిణమరుత్తు నీకు విమలత్వంబును బశ్చిమమరుత్తు నీకు భుజవీర్యంబును నుత్తరమ
రుత్తు నీకు బలంబును నొసంగుం గాత యని దీవించినయనంతరం బాకాశంబున
నుండి యశరీరవాణి యెల్లవారు వినుచుండ నీగురుం డైనతుంబురుండు కుమారు
నికి మరుత్తులు శుభం బొసంగు నని పెక్కుమాఱులు పలికె నది కారణంబుగా
నితండు మరుత్తనామంబునం బ్రఖ్యాతుం డగు మహీపతు లెల్ల నీతనిశాసనంబు
శిరంబుల ధరియింతు రీవీరుండు సకలరాజచూడామణి యగు నీమహత్తుండు భుజ