పుట:మార్కండేయపురాణము (మారన).pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హావష్టంభము నుల్లసిల్లఁగ నితాంతామర్షు లై దందశూ
కావాసంబు చలింపఁ బోరిరి గుణవ్యాపారఘోరంబుగాన్.

270


వ.

ఇవ్విధంబున నయ్యిద్దఱు ఘోరయుద్ధం బొనరించి రప్పు డద్దనుజుండు నరేంద్ర
నందనుచేత నొచ్చి కోపించి యక్షతగంధపుష్పధూపార్చితం బై యంతఃపురం
బున నున్నముసలంబునకుం జని యంతకుమున్న యమ్మహనీయసాధనప్రభావంబు
ముదావతి యెఱింగినయది గావునఁ బూజావ్యాజంబున నిచ్చలుం దనకరంబున
నంటుటం జేసి నిర్వీర్యత్వంబు నొందినదానం బుచ్చికొని వచ్చి యరిబలంబుమీఁదం
బ్రయోగించినం దదీయపాతంబులు వ్యర్థంబు లగుటయు.

271


క.

వివిధాస్త్రశస్త్రముల న, య్యవనీశకుమారుతోడ నసుర గడంకం
బవర మొనరించె నయ్యిం, దువదనచే ముసల మట్లు దుర్బల మైనన్.

272


వ.

అంత.

273


మ.

అవనీనాథతనూజుఁ డద్దనుజు శస్త్రాస్త్రావలిం ద్రుంచిన
న్దివిజారాతి కృపాణముం గొని మదోద్రేకం బెలర్బంగఁ బైఁ
గవియం జూచి భనందనందనుఁ డుదగ్రక్రోధుఁ డై వానియ
క్కు వెస న్వ్రయ్యఁగ నేసె నుజ్జ్వలశిఖాఘోరానలాస్త్రంబునన్.

274


మహాస్రగ్ధర.

అనిలాస్త్రం బట్లు వక్షం బవియఁ గొనిన వీతాసుఁ డై యాజి గూలెన్
దనుజేంద్రుం డప్పు డత్యుత్సవమున ఫణభృద్ధామ ముల్లాసి యయ్యె
న్దనర న్గీర్వాణవాద్యధ్వనులు చెలఁగె గంధర్వగీతంబు లింపొం
ద నవోద్యత్పుష్పవృష్టి న్ధరణిపసుతమూర్ధస్థలం బొప్పె నంతన్.

275


క.

ఆవత్సంధ్రనృపుఁడు త, ద్భూవరుపుత్రులను గూఁతు భూరిప్రియసం
భావన బంధచ్యుతులం, గావించె భుజంగవరులు గడు వెఱఁ గందన్.

276


వ.

అప్పు డశేషోరగేశ్వరుం డైన శేషుండు కుజంభునిముసలంబు పుచ్చికొని ముదావతి
నిత్యంబును మనంబునం దన్ను నారాధించుచు సునందస్పర్శనం బాచరించుటం
జేసి ప్రసన్నుం డై దానికి సుసంద యనునామం బొనరించె నంత నారాజ
పుత్రుండు భ్రాతృసహితంబుగా సునందం దోడ్కొని తదీయజనకునికడ కరిగి
యతనికి నమస్కరించి యి ట్లనియె.

277


క.

జనవల్లభ! భవదాజ్ఞం, జని యద్దానవుని దునిమి శౌర్య మెసఁగ నీ
తనయురఁ గూఁతుం దెచ్చితి, నొనరింపుము ప్రీతి యెద్ది యుచితము దానిన్.

278

వత్సంధ్రుఁడు విదూరథపుత్రిక యగుముదావతిని బెండ్లాడుట

సీ.

అనిన విదూరథుం డానందరసభరితాతుఁ డై వత్సంధు నాదరమునఁ
గనుఁగొని వత్స! నీయనుపమశౌర్యంబు గొనియాడ నేరికిఁ గొలఁది యగునె!
యమరాదులకు నెల్ల నక్కుగొఱ్ఱైన కుజంభు భయంకరుఁ జంపి నాదు
బిడ్డలఁ దెచ్చినపెం పల్పమే యిట్టిఘను నిన్ను నల్లుఁడు గాఁగఁ బడసి


తే.

యేఁ గృతార్థుండ నైతి నరేంద్రతనయ, మత్తనూజ ముదావతి మదగజేంద్ర