పుట:మార్కండేయపురాణము (మారన).pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అని యిట్లు నిభృతుఁ డై యాడినవాక్యంబు విని కరుణించి యమ్మునికుమారుఁ
డానరేంద్రునిఁ జూచి యే నెట్లు పలికితి నది యట్ల కాక తప్పదు మహీశ!
యెన్నఁడుఁ గావున నిచ్చినశాపంబు కుదియింప నెమ్మెయిఁ గొలఁది గాదు
కర మల్గి యిప్పు డీఁ గడఁగినశాపంబు పరిహరించితి నని పలికె నంత


తే.

నతనిఁ దోడ్కొని మౌని నిజాశ్రమమున, కరిగె శూద్రత్వముఁ బొందె నావృషధ్రుఁ
డనఘ కారూషుఁ డనఁగఁ బ్రఖ్యాతుఁ డైన, మనుతనూభవుఁ డేడ్వురఁ గనియె సుతులు.

204

కన్యకై నాభాగునకు వైశ్యునకును సంవాదము

వ.

వారలును గారూషు లనుపేర నారూఢు లైరి తత్సంతానంబు శతసహస్రసంఖ్యలం
బ్రవర్తిల్లె మఱియు మనుపుత్త్రుం డైనధృష్టునకు సమాచరితజనానురాగుండు
నాభాగుం డనుతనయుం డుదయించి నూత్నయౌవనోల్లాసభాసమానుండు వివిధ
విహారపరాయణుండు నై చరియించుచు నొక్కనాఁ డొక్కవణిక్కన్య ననన్య
సామాన్యరూపాభిశోభిత యవుదాని నభివీక్షించి తదాసక్తచిత్తుం డై చేతోజాత
శరాహతి కోర్వక యేకాంతంబున నక్కాంతగృహంబునకుం జని తజ్జనకున కి
ట్లనియె.

205


తే.

చారుతరరూపమహిమఁ బెంపారునీత, నూజఁ గనుఁగొని యేను మనోజబాణ
దళితహృదయుండ నైతి సంతసము మిగుల, నత్తలోదరి నాకు నిమ్మనుడు నతఁడు.

206


తే.

ఇల సమస్తంబు నేలు రాజులరు మీర లధిప! యే మరి యప్పన మచ్చి భృత్య
మాత్ర వర్తించు పేదకోమటుల మిట్టి, మనకు సంబంధ మెమ్మెయి నొనరుఁ జెపుమ.

207


వ.

అనిన నాభాగుండు.

208


క.

కలవారు పేదవా రనఁ, గలదే భోగముల సరియ కాక తలఁప దే
హుల కెల్ల నేల చెప్పెదు?, వలదని పరిహార మిట్లు వైశ్యవరేణ్యా!

209


సీ.

నావుడు వైశ్యుండు నాభాగుఁ గనుఁగొని యేను స్వతంత్రుండనే కుమార!
నీవును నాయట్ల కావున మన కెల్ల నొడయండు మీతండ్రి యున్నవాఁడు
చని యమ్మహారాజుననుమతి వడసి ర మ్మట్లైన సుత నిత్తు ననుడు నాతఁ
డీపని గురున కే నే మని చెప్పుదు మానుము నీ వెడమాట లనిన


ఆ.

నపుడు నగరి కరిగి యవ్వణిజుండు భూవిభున కంత తెఱఁగు విన్నవించెఁ
బతియు బుద్ధిఁ జెప్పఁ బనిచె రుచీకాది, భూమిసురుల నంతఁ బుత్త్రుకడకు.

210

తండ్రియానతి నిరాకరించి నాభాగుఁడు కోమటికన్నెం బెండ్లాడుట

ఉ.

ఆయవనీసురు ల్నృపవరాత్మజుపాలికిఁ బోయి క్షత్త్రియ
న్యాయము దెప్పి మున్న వణిగన్వయకన్య వరింపఁ గూడునే