పుట:మార్కండేయపురాణము (మారన).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నందగోపకులంబున యశోదాగర్భంబున నావిర్భవించి యారాక్షసులను సమయించి
వింధ్యాచలంబున వసియింతు నది నిమిత్తంబుగా వింధ్యవాసిని యనం బరఁగుదు
మఱియు రౌధ్రం బగురూపంబున నవనీతలంబున నవతరించి వైప్రచిత్తాదిత్యు
లం బెక్కండ్ర భక్షింతు నప్పుడు మదీయదంతంబులు దాడిమీకుసుమంబులుంబోలె
రక్తంబులగు నది నిమిత్తంబుగా మర్తామర్త్యలోకవాసులు నన్ను రక్తదంతియని
కీర్తింపుదురు శతవర్షావగ్రహంబునం జేసి జగంబులు నిర్జలంబులై యున్న మహా
మునులు భయంబంది న న్నభినందించిన నయోనిజనై భూమియందుం బ్రభవించి
శతనేత్రంబుల నమ్మునుల నాలోకించి వారిచే శతాక్షీనామప్రశంసావిశేషంబు
నొంది యశేషలోకంబు నస్మచ్ఛరీరసంభూతశాకాహారంబుల భరియించి శాకం
భరి యను పేరం బరగుదు దుర్గముం డనుదుష్టాసురుం జంపి దుర్గాభిధానంబు
గైకొందు భీమవేషంబున హిమవంతంబున నెలకొని సంయమిత్రాణార్థంబు పూర్వ
గీర్వాణవ్రాతంబు నడంచి భీమాహ్వయంబు నంగీకరింతు సకలలోకాపకారి యగు
వరుణుం డనువాని భ్రమర్యాకారంబునం బరిమార్చి భౌమరీసమాఖ్యం బ్రఖ్యాతి
వహింతు నివ్విధంబున నేను మఱియును దనుజబాధ లెప్పుడు వర్తిల్లు నప్పు
డెల్లను జన్మించి యద్దనుజుల భక్షించి భువనంబులు రక్షింపఁ గలదాన నని చెప్పి
యప్పరమేశ్వరి సురేశ్వరులం గరుణావలోకనంబుల నాలోకించి.

230


క.

నను నీస్తవమున నెవ్వం, డనుదినమును భక్తితో సమాహితమతియై
వినుతించు నతనియాపద, లనయంబును నే నసంశయంబుగఁ గ్రాతున్.

231

సప్తశతీపఠనఫలశ్రుతి

సీ.

మధుకైటభాసురమథనప్రకారంబు మహిషభంజనకథావిహరణంబు
శుంభనిశుంభవిశుంభనక్రీడయు నాదుమాహాత్మ్యంబు నాదరంబు
తో నెవ్వ రొగి నష్టమీనవచతుర్దశులఁ గీర్తింతురు దవిలి భక్తి
వారి నఘంబులు చేర వాపదలు పొందవు దరిద్రత్వంబు దనుక దరిభ


తే.

యమును దస్కరభయమును నగ్నిభయము, శస్త్రభయరాజభయములు జలభయంబు
భూతభయమును బాయు నెప్పుడు ననేక, భూరిసంపద లుడుగక పొందుచుండు.

232


క.

వినవలయుఁ జదువవలయు, కొనియాడఁగవలయు భక్తి కొనలు నిగుడఁ గా
ననిశము మన్మాహాత్మ్యం, బనుపమశుభలాభములకు నది తెరు వగుటన్.

233


క.

వినుము మహామారీసం, జనితం బగుదారుణోపసర్గవికారం
బును విధోత్పాతభయం, బును మన్మాహాత్మ్యపఠనమున శమియించున్.

234


సీ.

ఎచట నామాహాత్మ్య మెప్పుడు పఠియింతు రచటు నానిలయ మే నచటు విడువ
నగ్నికార్యమహోత్సవారంభబలిదానసమయంబులందు మచ్చరిత మర్థిఁ