పుట:మార్కండేయపురాణము (మారన).pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


న్బలువడిఁ బడ నేసె న్భైరవాటోపలీల
న్జెలఁగి నిశితబాణశ్రేణి నద్దేవి యంతన్.

196


సీ.

దర్పదుర్దముఁ డైనతమ్ముఁ డిమ్మెయి రణస్థలమున సోలినఁ దద్ద యలిగి
శుంభుండు చండికసొం పడఁగింపఁగఁ జూచి రథం బెక్కి సునిశితోజ్జ్వ
లాయుధస్ఫురితబాహాష్టకం బాకాశ మంతయుఁ గప్పి భయంకరముగఁ
జను దేరఁ గని దేవి సకలారిసైన్యతేజఃప్రాణములు మ్రింగఁ జాలునట్టి


తే.

శంఖరవమున శింజినీస్వనమునను బ్ర, చండఘంటాస్వనంబున సకలదిశలు
చెవుడు పడఁ జేసె వాహనసింహ మడరి, చెలఁగె గజములు మదమఱి చేష్ట లుడుగ.

197


వ.

అప్పుడు.

198


క.

కాళి యెగసి యిరుగేలను, నేలయు నింగియును వ్రేయ నిష్ఠురరవ మా
భీలముగఁ జెలఁగె ముందరి, కోలాహలరవము లెల్లఁ గుంఠితములుగన్.

199


తే.

చేసె శివదూతి తీవ్రాట్టహాస మప్పు, డారవంబును విని శుంభుఁ డధికరోష
దీప్తుఁ డగుటయు నంబికాదేవి వాని, నట దురాత్మక నిలు నిలు మని యదల్చె.

200


వ.

అప్పు డంబరంబుననుండి యమరు లద్దేవిం గెలు గెలు మని దీవించి రానక్తంచర
వరుం డనలజ్వాలాకరాళ యగుశక్తి నిగిడించిన నంబిక మహోల్కాభాతిం బొడి
సేసిన సంరంభజృంభితుం డై శుంభుండు త్రిభువనకుహరంబు నిండి నిజసింహ
నాదంబున ఘూర్ణిల్ల విలయసమయనిర్ఘాతఘోరంబుగా నార్చె నంత.

201


తే.

శతసహస్రసంఖ్య లమితశరము లుగ్ర, లీలఁ దునుమాడుచును రణకేళి సలిపి
రసురనాథుఁడు దేవియు నంత దేవి, శుంభుసుర ముచ్చిపో వైచె శూల మెత్తి.

202


తే.

వైచుటయు రక్కసుఁడు నేల వ్రాలి సొగసె, మున్ను దివ్యాస్త్రహతి మూర్ఛ మునిఁగినట్టి
యానిశుంభుఁడు దెప్పిఱి యంత నొంచె, సింహమును దేవిఁ గాళిని శితశరముల.

203


శా.

శుంభుం డంతట మూర్ఛదేఱి బదివే ల్శుంభద్భుజంబు ల్రణా
రంభస్ఫూర్తి యెలర్పఁ దాల్చి బహుచక్రశ్రేణి నద్దేవి సం
రంభం బేదఁగఁ గప్పినం బటుశరవ్రాతంబునం జక్రము
ల్సంభిన్నంబులు చేసి తద్విశిఖము ల్ఖండించెఁ గాండంబులన్.

204


ఉ.

అంత నిశుంభుఁ డెంతయు రయంబునఁ జండికఁ జంపుకోప మ
త్యంతము గాఁగ వ్రేసె గద నాగద దేవి కృపాణిఁ ద్రుంచె వాఁ
డంతటఁ బోక చే సతి భయంకరశూలము దాల్చివచ్చు దు
ర్ధాంతతఁ జూచి శూలమున వ్రచ్చె సురేశ్వరి వానివక్షమున్.

205


వ.

అట్లు భిన్నవక్షుం డై పడిన నిశుంభునిహృదయంబుననుండి మహాబలపరాక్రమ
ధురంధరుం డొక్కపురుషుండు నిలు నిలు మని యదల్చుచు వెలువడినం