పుట:మార్కండేయపురాణము (మారన).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లొనరించి యింద్రుం డై పరగె నిప్పుడు నిలాతలంబున నుపసర్గదోషంబులు చెడ
శాంతుండును దేవకాంతుండును నైనసుశాంతి మాకు శాంతి యీవలయు నని
నిగమసూక్తంబులు పఠింతురు సుతేజసుఁడును సుతపుఁడును నాదిగాఁ గలవసిష్ఠ
పుత్రు లేడ్వురును సప్తఋషు లై చరించిరి మనువునకు బలపరాక్రమవంతు లైన
యజాదులు పెక్కండ్రు కొడుకులు పుట్టిరి తత్సంతానజాతు లగుభూపతు లనేకు
లమనువుకాలంబు డెబ్బదియొక్కమహాయుగంబులును మహీవలయంబు పరి
పాలించి రిది తృతీయమన్వంతరప్రకారం బింక వియోనిజాతుం డైనచతుర్థమను
వగుతామసుజన్మంబు ప్రభావంబును జెప్పెద నాకర్ణింపుము.

222

తామసమన్వంతరమహిమానువర్ణనము

చ.

అతులితభూరిబాహుబలుఁ డాహవ కేళిజితారి సంతత
క్రతువిభవాభిరాముఁడు సురాష్ట్రుఁడు నాఁ గలఁ డొక్కమేదినీ
పతి యతఁ డాయు వెక్కుడుగ బ్రాహ్మణవర్గముచేతఁ గాంచి యం
చితగతి నూర్వు రంగనలఁ జెల్వుగఁ బెండిలి యయ్యె వారలున్.

223


ఆ.

వంధ్య లైరి కాలవశమున నంత న, వ్వనితలును నమాత్యులును సమస్త
బంధుజనులు దెగిరి బలహీనుఁ డయ్యె న, వ్విభుఁడు భృత్యతతియు విడిచె నతని.

224


క.

అతిదుఃఖతుఁ డగునాభూ, పతిఁ ద్రోచి విమర్దుఁ డనునృపతి రాజ్యం బు
ద్ధతిఁ గొనియె నతఁడు రాజ్య, చ్యుతుఁ డై యొక్కరుఁడు నరిగె నుగ్రాటవికిన్.

225


సీ.

అరిగి వితస్త నాఁ బరగుమహానదితటమున నుండి నిదాఘవేళ
నగ్ని నల్గడ మండ నర్కునిఁ జూచుచు వర్ష కాలమున దుర్వారవృష్టి
పైఁ బెల్లు గురియంగ బయలు నిలిచి హిమసమయంబులం దుదకములు సొచ్చి
యతినిష్ఠతో నిరాహారుఁ డై తపము నిరంతరమును జేయ నంత వర్ష


తే.

కాలమున నీలనీరదజాల మడరి, నింగియును దిక్కులును గడు నిండఁ బర్వి
నిమిష మైనను నిలువక నిగ్రహముగఁ, గుండ గూల్చినక్రియ వాన గురియఁజొచ్చె.

226


వ.

అట్టిసమయంబున.

227


క.

ఇది పూర్వం బిది దక్షిణ, మిది పశ్చిమ మిద యుదీచి యిది దివి యనితోఁ
చద యించుకయును సాంద్రాం, బుదపటలము కరము భువనపూర్ణం బైనన్.

228


వ.

అంత.

229


ఆ.

రెండుదరులు ముంచి యొండొండ వెల్లువ, యగ్గలింప నురువు లడలుదేర
నతిరయమునఁ బఱచునయ్యేటివ ఱ్ఱొడ్డి, పోయె దవ్వు గాఁగ భూవిభుండు.

230


వ.

అట్లు బోవుచు నప్పుడమిఱేఁ డయ్యేటినీటిలో నీఁదుచు నొక్కపిడిదుప్పి చేరిన
దానితోఁక పట్టికొనియె నది యీడ్చుకొని పోవ నప్పెనుఁజీకటి దిక్కు దెస
యెఱుంగక యిట్టట్టునుం దిగిచి యెట్టకేలకు దరి యెక్కిన నతండు మఱియును
దానితోఁక విడువక చని మనోహరం బగువనంబు గని యన్నిబిడాంధకార