పుట:మార్కండేయపురాణము (మారన).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ్చిన చెలి వాగ్విభూతి విలసిల్లఁగ దానికిఁ జేఁత నాదునె
మ్మనమున కిం పెలర్పఁగ సమస్తము నీ వొనరించిన ట్లగున్.

209


తే.

అనుఁడు విప్రునిఁ జూచి యమ్మనుజవిభుఁడు, వాగ్విభవ మెట్లు గల్గు నవ్వనిత కనిన
నేను సారస్వతేష్టివిధానమున భ, వద్వధూటీసఖికి నిత్తు వాగ్విభూతి.

210


వ.

అని యప్పుడు సారస్వతేష్టి యొనరించి యమ్మహీసురుండు సారస్వతసూక్తంబులు
జపియించె నంత గర్గుం డనుముని రసాతలంబున కరిగి యురగపతినందన కంత
వృత్తాంతంబును జెప్పిన విని.

211


క.

ఆనంద దనమనమ్మున, నానందముఁ బొంది నావయస్యావిభుఁడే
మానుగ నా కుపకారము, దా నొనరించె నని మెచ్చి తద్దయుఁ బ్రీతిన్.

212


తే.

అపుడ కదలి యప్పురమున కరుగుదెంచి, యాత్మసఖిఁ గాంచి కౌఁగిట నర్థిఁ జేర్చి
యధిపు నందంద దీవించి యాభుజంగి, యాసనాసీన యై యిట్టు లనియె ననఘ!

213


క.

కర ముపకారము నాకుం, దిరముగ నొనరించి తీ వతిప్రియమున భూ
వర! యేను మెచ్చి వచ్చితి, వర మిచ్చెద నీకు విను దివాకరమూర్తీ!

214


ఉ.

నీతనయుండు సర్వధరణీపరిపాలనకేళిదక్షుఁ డై
యాతతధర్మకర్మరతుఁ డై మహనీయతరాస్త్రశస్త్రవి
ద్యాతివిదగ్ధుఁ డై భుజబలాధికుఁ డై పెనుపొందు దీధితి
ద్యోతితచక్రవిక్రమమహోధ్ధతి నప్రతిమానుఁ డై మహిన్.

215


వ.

అతఁడు మహనీయుఁ డైనమను వై నెగడు నని వరం బిచ్చి యచ్చెలువ నెచ్చె
లిం గౌఁగిలించుకొని నిజభవనంబున కరిగె నంత నమ్మహీకాంతుం డక్కాంతా
రత్నంబుతో నితాం ప్రమోదంబున మనోభవసుఖంబు లనుభవించుచుఁ బ్రజా
పాలనంబు సేయుచుండఁ బెద్దకాలంబు సనుటయు.

216

ఉత్తమమనుజననము

క.

పూర్ణిమ నుదయం బగుసం, పూర్ణసుధాంశుఁడును బోలెఁ బుత్రుండు దిశా
పూర్ణద్యుతి యై యావర, వర్ణినికిం బుట్టె సురలు వర్ణన సేయన్.

217


వ.

అప్పుడు.

218


ఆ.

మొరసె దివ్యతూర్యములు పుష్పవర్షంబు, గురిసె జనులు ప్రమదభరితు లైరి
సకలమునులు నెలమిఁ జనుదెంచి యుజ్జ్వలా, కారుఁ డైనయక్కుమారుఁ జూచి.

219


క.

ఉత్తమ మగువంశంబున, నుత్తమకాలమున నీతఁ డుత్తమతనుఁ డై
యుత్తమనృపతికిఁ బుట్టుట, నుత్తము: డనుపేరఁ బరఁగు నుర్వి నని మునుల్.

220


క.

చని రంతఁ బెరిఁగి యుత్తముఁ, డనఘుఁడు మనువయ్యె నుత్తమాఖ్యానంబు
న్వినినను జదివిన వనితా, తనయోపేతు లయి మండ్రు ధరణీజనముల్.

221


వ.

ఆయుత్తమమన్వంతరంబున దేవతలు స్వధాములు సత్యులు శివులు ప్రతర్దనులు
వశవర్తులు నన నేనుగణంబు లై వర్తిల్లిరి సుశాంతి యనువాఁడు శతక్రతువు