పుట:మార్కండేయపురాణము (మారన).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్రియాప్రభవంబులగు యవవ్రీహిగోధూమతిలప్రియంగుమాషముద్గంబు లాది
గా గ్రామ్యంబులు పదియేడును నీవారశ్యామాకగవేధుక లాదిగా నాటవికంబు
లేడును నై ఫలించుచుండునని యజ్ఞయోగ్యంబులై యతిశయిల్లు.

44


ఆ.

సహజవృత్తి నెద్ది సమకూరుఁ గృతయుగ, మహితవేళ సహజమానవులకు
సత్యధర్మములును సస్యసమృద్ధియుఁ, గల్గుచుండు నంతఁ గ్రమముతోడ.

45


చ.

తిరముగ రేయునుం బగలుఁ దృష్ణ జనింపఁగ గోరుకోర్కుల
న్దొరకొనుసిద్ధుల న్జనులు దుష్టి వహించుచు నిత్యయౌవన
స్ఫురణల నుల్లసిల్లుచు నసూయయు వైరము నింత లేక యొం
డొరువులఁ గూడి మందు నధమోత్తము లెవ్వరు గాక తుల్యులై.

46


ఉ.

వారు చతుస్సహస్రమితవత్సరజీవులు దంపతిప్రజా
ధారులు నై నిజేచ్ఛల ముదంబున నుండఁగఁ గాలదీర్ఘతన్
వారికిఁ గామ్యసిద్ధు లొగి వ మ్మయి పోయినఁ గల్పభూజముల్
చేరి తదాశ్రమంబుల వసింప సుఖించుచునుండి రుండఁగన్.

47


సీ.

త్రేతాయుగంబు వర్తింపఁ దొడంగిన నజ్జను ల్వ్రీడరాగాత్ము లైరి
ఋతువు తత్సతులకుఁ బ్రతిమాసములు గల్గె బహుళంబు లయ్యె నపత్యచయము
లంతఁ గల్పతరువు లడఁగిన నజ్జను లన్యభూరుహముల నాశ్రయించి
యం దుద్భవించుమహావీర్యమధురసంబున సతతము తృప్తిఁ బొందుచుండ


తే.

మోహలోభము ల్మనమున మునుఁగుపడిన, నివి మదీయమ్ములని యమ్మహీజములఁ బ
రిగ్రహించి రాదోషపరిగ్రహమున, నవియు మాయంబు లగుటయు నజ్జనములు.

49

బ్రాహ్మణాదులస్థానములు

ఆ.

ఒనర దేశములకు నుర్వులకును మేరు, లలవరించి యంత నవ్విరించి
వరుసతోడ సర్వవర్ణాశ్రమాచార, విధము లేర్పడంగ విస్తరించి.

49


వ.

బ్రాహ్మణులకుఁ బ్రాజాపత్యలోకంబును క్షత్త్రియులకు నింద్రలోకంబును వైశ్యు
లకు వాయులోకంబును శూద్రులకు గంధర్వలోకంబును బ్రహ్మచారులకు నూర్ధ్వ
రేతస్కులగు నష్టాశీతిసహస్రమునులస్థానంబును గృహస్థులకుఁ బ్రాజాపత్యస్థానం
బును వానప్రస్థులకు సప్తఋషిస్థానంబును సన్న్యాసులకు బ్రహ్మస్థానంబును బరమ
యోగులకు నమృతస్థానంబును నివాసంబులుగాఁ గల్పించె నని చెప్పి మార్కం
డేయుండు క్రోష్టుకి యిన్ని సర్గంబులకు మున్ను నలువ సృజించినకౌమారసర్గంబు
తెఱం గాకర్ణింపుము.

50


క.

సనకసనందనముఖముని, జనులం గల్పాది నజుఁడు సంపాదించె
న్విను వారు పరమయోగా, ర్థినిరూఢత్వమున నూర్ధ్వరేతసు లైనన్.

51


వ.

బ్రహ్మకు మహారోషం బుద్భవించిన యది.

52