పుట:మార్కండేయపురాణము (మారన).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

ఇట్లు ప్రజాపతివలనం దొలుత మానుషసృష్టి యయ్యె నంత దదన్వయజాతులైన
స్త్రీపురుషులచేత జగంబును వృద్ధిఁ బొందె నవ్విధం బాకర్ణింపుము.

36


ఉ.

ఆతతనైజతృప్తిప్రమదాంబుధిఁ దేలుచు లీల శీతవా
తాతపబాధలం బడక యాసతులు న్బతులు న్నిజేచ్ఛ ధా
త్రీతల మెల్లఁ ద్రిమ్మరుచు దివ్యనదీప్రదసింధుతీరసం
జాతవనప్రదేశములు శైలతటంబులు నున్కిపట్టుగాన్.

37


క.

విహరణపరులై పశుమృగ, విహగాదులవలన నింత వెఱ పెఱుఁగక ని
స్పృహులై సుఖులై యుండఁగ, బహుకాలము సనియె నంత ప్రజలు మనమునన్.

38

పట్టణగ్రామఘోషాదిపరిమాణము

వ.

శీతోష్ణాదిద్వంద్వంబులచేతం బీడితులై తమ కునికిపట్టులు విచారించి సహజంబు
లగుగిరిదుర్గ వనదుర్గ జలదుర్గంబులందు నివాసంబులు గావించి చతుర్థం బగు కృత్రిమ
దుర్గంబునవల శాస్త్రోక్తప్రమాణవృత్తాయతప్రాకారపరిఖావృతంబులుగాఁ బుర
ఖేటఖర్వటద్రోణీముఖంబులు రచియించి పెనుబయల మంత్రిసామంతగుప్తముగా
శాఖానగరంబును గృషీవలశూద్రబహుళంబుగా గ్రామంబును గోగజాకీర్ణగోపాల
జనోపేతంబుగా ఘోషంబును గడిభూమిం బరదేశబాధకదుష్టజనప్రాయంబుగా
దృశియును నన ని ట్లష్టవిధంబులై యుండ నిర్మించి యందు గృహంబులును శాల
లుం గల్పించుకొని శీతాతపాదిబాధల జయించి క్షుత్పిపాసార్తులై జీవనోపాయంబు
చింతించుచుండ.

39


శా.

త్రేతాది న్బహువర్షము ల్గురియ ధాత్రిం బుట్టి మున్నోషధీ
వ్రాతంబు ల్దమయంతఁ బుష్పఫలసంప్రాప్తి న్లతాగుల్మభూ
జాతంబు ల్విలసిల్లె నిమ్నగతవాస్సంవృత్తిమై నీమహీ
జాతంబు ల్గడు నుద్భవిల్లెఁ బ్రజకు న్సమ్మోద మేపారఁగాన్.

40


క.

దున్నక వెద పెట్టక యు, త్పన్నము లైనట్టివిపులబహుసస్యముల
న్బన్నుగఁ గైకొని జనుల, త్యున్నతితో నెలమి బ్రతుకుచుండఁగ నంతన్.

41


చ.

మనమున రాగలోభములు మత్సరము ల్గడు నగ్గలింప న
జ్జనులు గడుసమత్వమున సస్యములు న్నదులు న్నగంబులు
న్వనములు వేఱువేఱ బలవంతులు లుబ్ధులు నై కడంగి కై
కొనిరి తదీయదోషమునఁ గుంభిని యోషధుల న్గ్రసించినన్.

42


తే.

పటుబుభుక్షార్తులై జను ల్బ్రహకడకు, నరిగి శరణంబు వేఁడిన నతఁడు మేరు
భూధరముఁ గ్రేపుఁ గావించి భూమి గోవుఁ, జేసి పితికిన నోషధు ల్చెలువు మిగిలె.

43

గ్రామ్యారణ్యౌషధులు

వ.

వాని వెదపెట్టినఁ దద్బీజంబులు మొలచి పండునట్లుగా నక్కడ నుంచి యోషధు
లకు వ్యర్థత్వంబు లేకుండఁ బ్రజాపతి గావించె నది మొదలుగా సస్యంబులు కృషి