పుట:మార్కండేయపురాణము (మారన).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నెసఁగ నడుగు వారి కొసఁగి మన్ననఁ బ్రజ, ముదముఁ బొందఁ జేయునది విభుండు.

135


క.

ఎనిమిదినెలలును నల్లనఁ, దనకరముల భూరసంబు దఱుఁగం గొనుభా
నునిక్రియ సూక్ష్మోపాయం,బున నరిగొనవలయు నృపతి భూప్రజచేతన్.

136


క.

విమతులఁ బ్రియులం గాల, క్రమమునఁ దెగఁ జూచుయమునికరణిం దా దో
షము లరసి ప్రియాప్రియులను, సముఁడై దండింపవలయు జనపతి పుత్రా.

137


చ.

తమతమవర్ణధర్మములు దప్పి కుమార్గమున న్జరించుదు
ష్టమనుజవర్గముల దగినశాంతి యొనర్చుచు నైజధర్మమా
ర్గమునఁ జరింపఁజేయుమహికాంతుఁడు వారలపుణ్యసంపద
న్సమధికలీల నొంది దివి సౌఖ్యముఁ బొందఁగఁ గాంచుఁ బుత్రకా.

138


క.

వర్ణాశ్రమధర్మంబులు, పూర్ణము లై యుండు నేనృపునిరాష్ట్రమునన్
స్వర్ణదివిజసంగమసౌ, ఖ్యార్ణవమునఁ దేలఁ గాంచు నానృపుఁ డనఘా.

139


క.

నరుల నిజకర్మములఁ ద, త్పరులం గావించు ధరణిపాలుఁడు దా న
న్నరులసుకృతములలోన, న్బరువడిఁ గొనుచుండు షష్ఠభాగము పుత్రా.

140

వర్ణాశ్రమధర్మనిరూపణము

క.

అని చెప్పిన విని సుతుఁ డి, ట్లను వింటిని రాజనీతు లన్నియు జలజా
నన వర్ణాశ్రమధర్మము, లొనరఁగ నెఱిఁగింపు నాకు నుత్తమచరితా.

141


వ.

అని యడిగినం గొడుకునకుఁ దల్లి యిట్లను వినుము దానాధ్యయనయజ్ఞంబు
లను త్రివిధకర్మంబులు బ్రాహ్మణుక్షత్త్రియవైశ్యులు మువ్వురకు ధర్మంబులు శూద్రు
నకు దానద్విజాతిశుశ్రూషలు ధర్మంబులు మఱియు బ్రాహ్మణునకు యాజనాధ్యా
పనో త్తమప్రతిగ్రహంబులు క్షత్రియునకు ధాత్రీపాలనశస్త్రజీవిత్వంబులు వైశ్యు
నకుఁ గృషివాణిజ్యగోరక్షణంబులు శూద్రునకు సేవయు జీవిక లివి వర్ణధర్మంబు
లాశ్రమధర్మంబు లాకర్ణింపుము.

142


మ.

ఉపనీతుం డయి బ్రహ్మచారి వినయం బొప్ప న్గురుం జేరి భ
క్తిపరుం డై పను లెల్లఁ జేయుచు సకృద్భిక్షాశియు న్శాంతుఁడు
న్విపులప్రీతియుతుండు నై సతతము న్వేదత్రయాభ్యాసవా
క్యపటుత్వంబు భజించి సల్పఁ దగు నయ్యాద్యాశ్రమాచారమున్.

143


ఆ.

అనఘ బ్రహ్మచారి కవలియాశ్రమముల, కరుగుచోట వినుము వరుస వలన
దిష్ట మైనయట్టి దేయాశ్రమం బైనఁ, జేకొనంగఁ దగు విశిష్టచరిత!

144


శా.

దారస్వీకృతియు న్దయాభిరతియు న్ధర్మార్జితార్థక్రియా
స్ఫారత్వంబును దేవపిత్రతిథిపూజాస్థైర్యము న్దీనదా
సీరాజీసుతబాంధవాతురజన శ్రేణీసమృద్ధాన్నస
త్కారోదారతయు న్గణింప గృహికి న్ధర్మంబు లుద్యన్మతిన్.

145