పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

97


ఉ.

బంగరుపెండ్లిపీఁటపయి బాగుగ మన్నరుదాసు నుంచి తా
రంగు చెలంగఁ దాతగురురాయఁడు కంకణ మొప్పఁ గట్టఁగా
మంగళవాద్యముల్ మొరయ మచ్చిక మీర నలంగు వెట్టి యు
ప్పొంగుచు నాసువాసినులు పొల్పుగ సేసలు పెట్టి రందఱున్.

23


కాంతిమతీవైవాహికాలంకరణము, కంకణధారణము

క.

నగరిపురోహితు లప్పుడు
మగువకుఁ గంకణముఁ గొనుచు మహిమ జెలంగన్
దగ రాజచంద్రునింటికి
మిగులన్ వాద్యములు దిశల మెండుగ మ్రోయన్.

24


వ.

చేరన్ వచ్చు సమయంబున.

25


సీ.

ఆరాజచంద్రుండు గారాపుపట్టిని
        బెండ్లిపీఠమునందుఁ బ్రేమ నునిచి
కోమలికినిఁ గాళ్లగో ళ్లప్డు దిద్దించి
        లత్తుకఁ బెట్టించి లలితముగను
గుసుమగంధులచేతఁ గొట్నంబు వెట్టించి
        సుంకులు చెరిగించి పొంకముగను
దాంబూలఫలములఁ దనయకు నొడి నించి
        సేసలు పెట్టుచు భాసురముగ


తే.

నలుగుఁ బెట్టించి మంగళస్నాన మపుడు
సంతసంబున నొనరించి యింతి రాఁగఁ
బణఁతి గైసేయుఁ డనుచును బల్కుటయును
గాంతిమతిఁ జేరి సకియలు క్రమముతోడ.

26


సీ.

పాపటఁ దీర్పుచు బాగుగా నప్పుడు
        కోమలికినిఁ బెండ్లికొప్పు వెట్టి
బంగారుపువ్వుల పావడమీఁదను
        రమణికిఁ [1]బీతాంబరంబు గట్టి
జాళువాపనిహర్వు చాల రాణించఁగా

  1. క. హేమాంబరంబు