పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

మన్నారుదాసవిలాసము


వెలయ నస్మత్కులంబు పవిత్ర మయ్యె
గోరిన శుభంబు లెల్లఁ జేకూడె నేడు.

40


క.

అని యిట్లు వినుతి సేయుచుఁ
దనసుత యౌ కాంతిమతినిఁ దద్దయు వేడ్కన్
వినయంబున మొక్కించిన
మనమున హర్షించి పలికె మందస్మితుఁ డై.

41


క.

విజయమునఁ గరుణచేతను
విజయుని రాఘవునిఁ బోలు వీరవరు న్నీ
రజముఖి బెండ్లాడెద వని
త్రిజగంబులు మెచ్చ నపుడు దీవెన లిచ్చెన్.

42


వ.

అని దీవించి యయ్యాచార్యవర్యుండు రాజచంద్రున కిట్లనియె.

43


ఉ.

తామరసాప్తతేజమున ధాత్రిని మించిన మేటి వౌదు వౌ
కాముని మేనమామగతి కన్నులు చల్లఁగఁ జేతు వెంతయున్
దామసవైరిబృందముల దండన సేయుదు నిండు వేడుకన్
భూమిని రాజచంద్ర! నినుఁ బోలఁగ నేర్తురె రాజు లెవ్వరున్!

44


వ.

అని పలుకు నాచార్యవర్యునిం జూచి రాజచంద్రుఁ డిట్లనియె.

45


క.

దేవర యిటకున్ వచ్చిన
భావం బదియేమి? తెలియఁ బలుకఁగవలయున్
సేవకుఁడ గాన నిప్పుడె
గావించెదఁ గోరినట్టి కార్యము లెల్లన్.

46


వ.

అనిన రాజచంద్రునకు నాచార్యవర్యుం డిట్లనియె.

47


సీ.

రాజచంద్ర! వినుము రాజగోపాలుని
        సేవించువేళను జెలువుమీరు
మేడపై నీపుత్రి మెఱుఁగుకైవడి నుండె
        మన్నారుదాసుఁ డామగువఁ జూచి
తమితోడఁ బెండ్లాడఁ దలఁచి మ మ్మిప్పుడు
        నీవద్దికిని బంపె నెనరుమీరఁ
గావున నీపుత్రిఁ గమనీయశుభగాత్రి
        నీకాంతిమతి నిమ్ము శ్రీకరముగఁ