పుట:మన్నారుదాసవిలాసము (పసపులేటి రంగాజమ్మ).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

83

శ్రీనివాసతాతయాచార్యులు వివాహనిశ్చయార్థమై రాజచంద్రునివద్ది కేతెంచుట; వివాహనిశ్చయము

వ.

అని యయ్యచార్యవర్యుండు విజయరాఘవమహీకాంతుని యంతరంగంబు
నకు సంతసం బొనరించి బంగారుటనుసుల రంగారు వింతవగపనుల దంతపు
పల్లకి నెక్కి, చెంతలను శ్రీవైష్ణవశ్రేణులు గొలువ, నగ్గలం బగు హెగ్గా
ళెలు దిగ్గగనంబులు నిండి మెండుగా మ్రోయ, సువర్ణదండరంజితంబు
లగు వింజామరంబులు వీవ, నిస్తంద్రచంద్రమండలరాజమానంబు లగు
వాజపేయఛత్రశతంబులు వరుసగా నిరుగడల ధరింప, సురభిఘృతధారా
పూరితంబు లైన దివాదీపికానికరంబులుఁ బరిచారకప్రకరంబులు బూని
క్రందుకొని సందడిగ నడువ, మాపాల వెలయు గోపాలుఁ డీమహామహుఁడే
యని యాబాలగోపాలంబును నందంద వందనంబులు సేయ నానందింపుచు,
సకలవైభవసాంద్రుఁ డగు రాజచంద్రునిహజారంబునకు వచ్చునవసరమున.

37


క.

అవసరమువారు దెలుపఁగ
జవమున నెదురుకొని రాజచంద్రనృపతియున్
సవరణలు మెఱయ నప్పుడు
సవరింపుచు బహువిధోపచారము లెల్లన్.

38


క.

యాదవతిలకుఁడె యితఁ డని
వే దండము లిడుచు మిగుల వేడుకమీరన్
గైదండ యొసఁగి తోడ్కొని
యాదరమున నరిగి వినయ మమరఁగ నంతన్.

39


సీ.

అంతఃపురంబున ననుపమనవరత్న
        సింహాసనమున నాసీనుఁ జేసి
భక్తిమీరఁగ నిజభామలుఁ దానును
        నర్ఘ్యపాద్యాదుల నాచరించి
దాహంబుచేతను దాపంబుఁ జెందెడు
        నరునకు నమృతంబు దొరికినట్లు
లేమిచే మిగులఁ దూలినయట్టి పేదకు
        నధికమౌ నిక్షేప మబ్బినట్లు


తే.

స్వామి వచ్చుట జన్మంబు సఫల మయ్యె
ధన్యుఁడను నైతి నే నిటు ధరణిలోన