పుట:మధుర గీతికలు.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చుఱుకుచుఱుకున నాతండు చూచి అనియె ;
“నన్ను కేవలసామాన్యనరునిరీతి
మాటలాడెదు తారతమ్యంబు లేక;
ఎవ్వ రనుకొంటి ? సేనానిఁ జువ్వె యేను.”

“అహహా ।; మీర లంతటి మహామహు లటంచు
ఎఱుఁగ కాడితి, నను క్షమియింపుఁడయ్య"
అనుచు తెరువరి మెల్లన హయము డిగ్గి
శక్తికొలఁదిని భటులకు సాయపడియె,

తోడనే వారు పథికుండు తోడుపడఁగ
ఎత్తి రవలీల దూల మువ్వెత్తుగాఁగ; ,
చెంత నిలుచుండె నడుమునఁ జేయివైచి
భూవరుం డన దళవాయి ఠీవి మెఱయ.

అంత తెరువరి నవ్వుచు నతని కనియె
“అన్న ! ఎపుడైన పని యున్న నన్ను పిలువుఁ;
డన్యుఁడను గాను, సర్వసైన్యాధిపతిని,
నన్ను పిలుతురు 'వాషింగుట' న్నటంచు.”