పుట:మత్స్యపురాణము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత్స్యపురాణము

85


గీ.

ఇతని విడిపించుకొనిపోవ నింద్రుఁడైనఁ
జంద్రఖండార్ధధరుఁడైన సకలలోక
నాయకుండు బ్రహ్మయైనను నశక్తు
లట్టియెడ నీకు మగతనం బలరెనేని.

110


క.

బెదరక హృదయములోపలఁ
బదిలుఁడ వై దండహస్తభయరహితుఁడ వై
యెదిరించి యిచట మాతో
గదనం బొనరింపవలయుఁ గ్రమ మొప్పంగన్.

111


వ.

అని యిట్లు విష్ణుకింకరులు శంకారహితులై పలికిన వచనంబులకుఁ దలం
గుచు సమవర్తి సమరంబు విసర్జించి లజ్ఞానమితకంధరుం డై సైన్యంబు
తోడం గూడి నిజసదనంబునకుం జనిన యనంతరంబున హరిదూతలు సుభ
ద్రునిం గొని వైకుంఠనగరంబున కరిగి రని చెప్పి మఱియు నిట్లనియె.

112


చ.

వినుము మునీంద్ర శ్రీతులసివృక్షముఁ బ్రోచిన మానవోత్తముల్
తనయవధూజనాప్తధనధాన్యసమున్నతులై జగత్త్రయం
బున నతిపూజ్యులై విబుధపూజితు లై తుది విష్ణుమందిరం
బున విహరించుచుందురు విభూషణభూషితదివ్యదేహులై.

113


క.

ధరణీసురు హస్తంబున
హరిం దులసిం బూజసేసి యంత్యజుఁ డైనన్
దురితములఁ బాసి చనుఁ ద
త్పురమునకును సకలలోకపూజితుఁ డగుచున్.

114


క.

శ్రీతులసీమాహాత్మ్యము
చాతురితో వినిననైనఁ జదివిననైనన్
ఖ్యాతుండై మనుజుఁడు చను
నాతతహరిమందిరమున కతిముద మలరన్.

115


వ.

అని యిట్లు తులసీమహాత్మ్యంబు చెప్పిన విని జనకునకు నారదుం డిట్లనియె.

116


చ.

అనయము కామినీసుతధనాప్తసముద్గతమోహయుక్తమై
పనుపడి పిప్పలచ్ఛదముభాతిఁ జలించుచునున్నచిత్త మె