పుట:భీమేశ్వరపురాణము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 63

వ. అగస్త్యేశ్వర, రామేశ్వర, నాకులేశ్వర, గణేశ్వర, పాతాళభైరవేశ్వరలను దేవతాపంచకంబుఁ బంచతీర్ణంబులను దర్శించి మానవుఁడు పండ్రెండు పుణ్యతీర్థంబులు దర్శించిన ఫలంబులందు మూలస్థానేశ్వరలింగం బాదిమూలం బద్దివ్యలింగంబు దర్శించి భీమమండలంబునందు శివలింగస్థానంబు లెన్నిగల వన్నియు దర్శించిన ఫలంబు గైకొను వెండియు. 173

తే. సప్తగోదావరము భీమశంకరునిని, నాకులేశస్వయంభుఁ బినాకపాణి
రుద్రపాదంబులును సమారూఢభక్తిఁ, దలఁతు రెవ్వారు వారపో ధన్యమతులు. 174

వ. అని దక్షారామమాహాత్మ్యంబును భీమలింగమహిమంబును సప్తగోదావరప్రశస్తియు ద్వాదశతీర్థప్రభావంబును బంచతీర్థప్రయోజనంబును వినిపించి కుంభసంభవుండు. 175

తే. భీమనాథునిఁ ద్రిభువనస్వామిఁ గొలువ
బోదమే యిప్టు మధ్యాహ్నభోగవేళ
నదె విజృంభించె నాట్యసౌధాంతరమున
నృత్యజగఝంకృతమృదంగనిస్వనంబు. 176

వ. అని పలికి యనంతరం బయ్యిరువురు రాజమార్గంబున. 177

అగస్త్యవ్యాసులు భీమేశ్వరాలయంబుఁ బ్రవేశించుట


సీ. త్రిపురసంహారంబు దివిజనాయకభుజా, స్తంభదంభోళిసంస్తంభనంబు
గరళకూటమహాగ్ని కబళనాటోపంబు, దక్షాధ్వరక్రియాధ్వంసనంబు
మత్స్యలాంచనదర్ప మథనసంరంభంబు, దేవదారువనప్రదేశవిహృతి
నురులింగమూర్తి విస్ఫురణవిలాసంబుఁ, గాత్యాయనీకరగ్రహణకేలి
తే. గండవేదండదానవఖండనంబు, దండపాణిజలంధరాంధకవధంబుఁ
బాడు గంధర్వపతులచే భరితమైన, మొగలివాకిలి సొచ్చి రమ్మునిఋషభులు. 178

సీ. పంచాంగశుద్ధిగాఁ బరిఢవించుచు భృంగి, మతినాడు నెందేని ప్రతిదినంబు
త్రిదశవర్గంబు ముప్పదిమూఁడుకోట్లును, నేకదేశమున నెందేని యుండుఁ
బలుకుపూఁబోణి యర్వదినాల్గుకళలతో, విహరించు చెందేని విద్య చూపు
సాని యీశానియై సవరించు నెందేని, మహితపింఛాలీల మరులు వీట
తే. నెద్ది కైలాసశిఖరికిఁ బెద్దయుద్ధి, పాలమున్నీటి కెయ్యది ప్రసవభూమి
చంద్రలోకంబునకు నెద్ది సాటి యట్టి, భవునికళ్యాణమండపంబుఁ గనిరి. 179

ఉ. దానికిఁ దూర్పుదిక్కున సుధాకరబింబసహస్రకోటిశో
భానిభకాంతితో గగనభాగము రాయుచు భీమనాయకే