పుట:భీమేశ్వరపురాణము.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62 శ్రీ భీమేశ్వరపురాణము

స్సహముగఁ జేసే నయ్యె బ్రచండతనం బచటన్ శివుం డను
గ్రహమున నుగ్భవించె నని క్రచ్చఱఁ బల్కుఁ బురాణసంహితల్. 161

క. అది యాదిగఁ దీర్థంబులు, పదియును రెండయినఁ దీర్థపాలీజాతం
బదియ కడునెక్కు వై యు, న్నది సప్తతటంబునందున న్మునివర్యా. 162

క. లంకించి యరుంధతిపతి, మంకణునకుఁ జెప్పె ననుఁగుమామకు గిరికిన్
సంకల్పసిద్ధిదుండగు, శంకరుఁ డఖిలార్థిఫారిజాతం బనుచున్. 163

క. గిరిసార్వభౌమకన్యా, కరగ్రహణసుమంగళైకకౌతుకసంప
త్పరిపూర్ణహృతయు శంకరుఁ, గరుణాకింకరుని నురగకంకణుఁ గొలుతున్. 164

క. నీహారభూధరేశ్వరు, నీహారమణీయమూర్తి నిందుకరహిమా
నీహారహీరకుముదసు, ధాహారసమానకాంతి నభివర్ణింతున్. 165

సీ. భూధరేశ్వరతీర్థమునఁ గృతస్నానుఁడై , భూధరేశ్వరుఁ గొల్చు బోధఘనుఁడు
నిత్యమంగళుఁడు నిర్నిద్రభద్రుండును, లక్ష్మీవిలాసైకలక్ష్మయుతుఁడు
నగుఁ దీర్థములలోన నత్యుత్తమంబైన, తీర్థంబు భక్తిముక్తిప్రదంబు
మంగళమంగళాత్మకము కళ్యాణక, ళ్యాణస్వరూప మీయాస్పదంబు
తే. ధరణిధరనాయకునకుఁ బ్రత్యక్షమైన, యవ్విరూపాక్షునగరమధ్యాహ్నవేళ
భోగఘంటాస్వనము విన్న భూజనులకు, నవల వినవచ్చు ముక్తికళ్యాణఘంట. 166

మ. హిమవధ్భూధరసార్వభౌమవరవిశ్వేశోపహారక్రియా
క్రమసంతాడితఘంటికాఘణఘణత్కారంబు విన్నట్టి యు
త్తమపుణ్యుండు వినండు ప్రాణపవనోత్క్రాంతివ్యథావేళ దు
ర్దమవైవస్వతవాహ్యఘోరమహిషగ్రైవేయఘంటాధ్వనుల్. 167

తే. శ్రాద్ధపిండప్రదానాదిసకల విధులు, నొక్కటొక్కటి కోటిగుణోదయమునఁ
దృప్తిఁ గల్పించు దివిపితృదేవతలకు, ధరణిధరరాజశంభుతీర్థంబునందు. 168

తే. సప్తగోదావరముఁ దెచ్చి సప్తమునులు, సప్తసస్తేందుశిఖివిలోచనుని నిలిపి
రమ్మహాశంభులింగ మభ్యర్చితులకుఁ, గామితార్థప్రదానైకకల్పకంబు. 169

క. ఒకమాటు జలకమార్చిన, నొకమాటొకపువ్వుమౌళి నునిచిన నొకమా
టకుటిలమతి గుడిఁ దిరిగిన, సకలేప్సితముల నతండు సంపాదించున్. 170

తే. భీమనాథేశ్వరునిపార్శ్వభూమియందుఁ, బంచశివలింగములకు నాస్పదములైన
పంచతీర్థంబులును నాడుపంచజనులు, పాయుదురు పంచవిధమహాపాతకముల. 171

తే. అందు వాపితటాకకుల్యాదులందుఁ, దీర్థమాడ వివేకి బుద్ధిం దలంపఁ
బంచతీర్థంబు లందిచ్చుఁ బంచజనుల, కాత్మసలిలావగాహపుణ్యాతిశయము. 172