Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 49

శుభముహూర్తంబునకుఁ గాలశుద్ధి దెలియఁ
దలఁచి కూర్చుండి రొకవివిక్తస్థలమున. 39

వ. అప్పుడు కాలశుద్ధి విమర్శించి మైత్రావరుణుండు పరాశరసుతున కిట్లనియె. 40

తే. గార్గ్యసిద్ధాంతమత ముషఃకాలకలన, శకున మూనుట యది బృహస్పతిమతంబు
విప్రజనవాక్య మరయంగ విష్ణుమతము, సర్వసిద్ధాంత మభిజిత్తు సమ్మత మగు. 41

తే. అసురపురములు సాధించె నంధకారి, యమరపాథోధి ముథియించి రమరవరులు
దివ్యసింహాసనం బెక్కె దివిజభర్త, సిద్ధమధ్యాహ్నవే ళాభిజిత్తునందు. 42

వ. ఇంక నొక్కవిచారంబు. 43

తే. నాభిమండల మిచ్చోటునడుము గాన, భీమమండలి కాపుణ్యభూమినెల్ల
నిచ్చటనె యుండి వీక్షింతమే? మునీంద్ర, యాకసం బెక్కి యోగవిద్యాబలమున. 44

క. భద్రగతి నేను లోపా,ముద్రయు నిర్నిద్రయోగముద్రాశక్తిం
రుద్రవిహారాలయము స, ముద్రముతోఁ గూడఁ జూతు మోమునివర్యా. 45

తే. ఇప్పుడు ఘటకాద్వయం బయ్యె నినుఁడు పొడిచి, దవ్వు చాల దిచ్చోటికి దక్షవాటి
కేవలము మంచినడకైనఁ గీసవెల్తి, రెండుజాములు నిట నూరకుండనేల. 46

వ. ఈ యోంకారపురపుణ్యక్షేత్రంబుసం ద్రికూటదివ్యభవననాటంబున మునిసంఘం బుండునది; మనము నభోమండలంబున కెగసి ముహూర్తమాత్రంబునఁ గన్నులపండువులుగా భీమమండలి పుణ్యక్షేత్రంబు గనుఁగొంద మనుటయుఁ బారాశర్యుండు సబహుమానంబుగా సమ్మతించిన. 47

వ్యాసాదు లాకసంబున నుండి భీమమండలంబుఁ గనుఁగొనుట


మ. పరమర్షు ల్భృతరోమహర్షమున లోపాముద్రయుం దారు నం
బరమధ్యంబున నావహం బను జగత్ప్రాణప్రవాహంబుపైఁ
బరిలంఘించిరి భుక్తిముక్తిరమణీప్రత్యగ్రలీలాస్వయం
వరసౌధంబగు భీమమండము సర్వంబున్ విలోకింపఁగన్. 48

వ. ఇవ్విధంబున నావహస్కంధగంధవాహప్రవాహమధ్యంబునఁ దపఃప్రభావావష్టంభంబున నిలిచి కుంభసంభవుండు బాదరాయణున కిట్లనియె. 49

సీ. అంధ్రభూభువనమధ్యము పుండరీకంబు, సప్తగోదావరజలము తేనె
బ్రహసంవేద్యాది బహుతీర్థములు రేకు, లకరులు చారుదివ్యస్థలములు
నాళంబు లవణాబ్ధి వేలావిభాగంబు, కళ్యాణభోగమోక్షములు తావి
దక్షవాటీమహాస్థానంబు కర్ణిక , హంసంబు భీమనాయకుఁడు శివుఁడు