పుట:భీమేశ్వరపురాణము.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

125


వ.

అఘమర్షణస్నానమాడిరి.

24


తే.

అఖిలకాలంబు నొకప్రవాహంబుతోడ, భీమలింగంబు సేవించి బెరసి ప్రేమ
యొరసి మదినుబ్బుపాతాళ మొరసిహారి, సప్తసింధువుమున్నీటి సంక్రమించె.

25


తే.

భీమలింగంబుమ్రోల గాంభీర్యసలిల, పూరమగుచుండు నేకాలమును సమృద్ధి
దనిసి తగఁ బాఱుచుండు నిత్యమ్ము ఘన ము,దారజలనిధి సప్తగోదావరంబు.

26


ఉ.

ఏట మునింగి లేచి పరమేశ్వరుమందిరసౌధవాటికా
హాటకకుంభమున్ గని షడక్షరమంత్రము జిహ్వఁ గూర్చి వా
చాటత సత్యతత్త్వుఁడగు శాంభవయోగివరేణ్యుఁ డేలజం
జాటపుసంసృతిం బొరలి చచ్చుచుఁ బుట్టుచు నుండు బార్వతీ.

27


చ.

కొడుకులు నీవు నేఁ బ్రమథకోటి విరించి సరోజలోచనుం
డుడుగణరాజఖేచరమహోరగకిన్నరసిద్ధసాధ్యు లె
ప్పుడు గొలువంగ వైభవము సొంపిరివోవఁగ దక్షవాటి నుం
డెడు శివు భీమనాయకుఁ దటిన్యవతంసు భజింప మేలగున్.

28


క.

సప్తాశ్వసంప్రతిష్ఠుని, సప్తమునీశ్వరప్రధానసంస్థితు నంత
ర్లుప్తస్వరూపుఁ ద్రిభువన, గోప్తను భీమేశ్వరేశుఁ గొలువుము తరుణీ.

29


వ.

భీమనాథమహాస్థానంబు సర్వకామార్థసాధకంబు; సంవత్సరంబును గొలువ ముక్తిప్రదాయకంబు. సూర్యుండు మేషరాశియందుఁ జిత్రానక్షత్రంబున వసియించి యుండు చైత్రమాసంబున సప్తగోదావరంబునఁ బ్రాతస్స్నానంబుఁ జేసి యథాశక్తి విఫ్రులకుఁ దగినదానంబు లొసఁగి, భీమనాథుండ నగునాకు నమస్కారాభిషేకపూజానైవేద్యంబు లాచరించి నరుండు సక్తభోజి యయ్యును నట్లె భానుఁడు వృషభరాశియందు విశాఖానక్షత్రంబు నాశ్రయించియుండు వైశాఖమాసంబునను, బ్రభాకరుండు మిథునంబునందు జ్యేష్ఠానక్షత్రంబునందు నిలిచియుండు జ్యేష్ఠమాసంబునను, రవి కర్కాటకంబున భగదైవతంబైన నక్షత్రంబున నాషాఢమాసంబునఁ గూడియుండఁగను, శ్రావణమాసంబున శ్రవణనక్షత్రంబున సింహరాశియందు మార్తాండుఁడు నిలిచియుండఁగను, భాద్రపదమాసంబునఁ బూర్వాభాద్రానక్షత్రమునఁ గన్యారాశియందు భానుం డుండఁగను, నాశ్వయుజమాసమున నశ్వినీనక్షత్రంబునందుఁ దులారాశియందుఁ జిత్రభానుండు నిలిచియుండఁగను, గార్తికమాసంబునఁ గృత్తికానక్షత్రంబున వృశ్చికరాశిని సూర్యుం డుండఁగను, మార్గశీర్షమాసంబున ధనూరాశియందు మృగశిరానక్షత్రంబున నభోమణియుండఁగను, బుష్యమాసంబునఁ బుష్యనక్షత్రంబున మకరరాశియందు లోకబాంధవుఁ డుండఁగను, మాఘమాసంబున మఘానక్షతంబునఁ గుంభరాశి