పుట:భీమేశ్వరపురాణము.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

శ్రీ భీమేశ్వరపురాణము


త్రంబునం బాపౌఘంబును నదిభస్మీభావంబునుంబొందింపంజాలును. ప్రాణవియోగ కాలంబున జంతుకోటికిం గాలకంధరుండు తారకబ్రహ్మవిద్యారహస్యార్థం బుపదేశించును. కానిమాత్రంబైన ధనంబును బిడికెఁడు ధాన్యం బైన నిచ్చుదాతకు ననంతఫలంబు చెందు. శ్రద్ధాసమన్వితంబుగా శివయోగికిం బెట్టిన భోజనంబును నిచ్చిన వస్త్రంబును భవబంధవిధ్వంసనంబులు. జపహోమదానతపోధ్యానసమాధియోగంబులు గలుగు పుణ్యులకుం గొలఁది లేదు. హిమవత్పర్వతంబునఁ గోటివర్షంబులు తపంబుచేసినఫలంబు ఘటికార్ధోపవాసమాత్రంబునను, వారణాసియందుఁ గోటిబ్రాహ్మణులకు భోజనంబుపెట్టినఫలంబు భిక్షునకు నొక్కభిక్ష యిడినమాత్రంబునను, గురుక్షేత్రంబున సూర్యగ్రహణకాలంబునం దులాపురుషదానంబు చేసినఫలంబు నొక్కభూసురాతి కథితి కభ్యాగతికి శివయోగులకుఁ బెట్టినభోజనమాత్రంబునను, దక్షవాటికాపుణ్యక్షేత్రంబున సంభవించు.

15


తే.

భీమలింగంబు త్రిభువనస్వామి యెపుడు, సన్నిధానంబుఁ గైకొనియున్నకతనఁ
దీర్థములలోన నుత్తమతీర్థ మయ్యె, దక్షిణానందవనవాటి దక్షవాటి.

16


తే.

ఘనత శివగంగయును రుద్రగంగ యనఁగఁ, గూపములు రెండు దక్షవాటీపురమున
మొదలి మది పాపములనెల్ల నుదకఁజాలు,నొకటి పితృదేవతలఁ దృప్తి మనుపనోపు.

17


ఆ.

అని వరంబు లిచ్చి యంతర్హితుం డయ్యె, నిందుమౌళి ఋషుల కెట్టయెదుట
వార లోన్నమశ్శివాయ యంచుఁ బఠించి, రొక్కమొగిని దిశలు పిక్కటిల్ల.

18


సీ.

పంచాక్షరీమంత్రపారాయణంబులు, పఠియించుచును స్పష్టఫణితితోడ
నెచ్చటి కేగితో యెఱుఁగకయున్నార, మెచటికి విచ్చేయ కిచట నుండు
మనుచుఁ బ్రార్థింపంగ నౌఁగాక యనిపల్కి, ఋషులు చూడఁగఁ జూడ నిందుధరుఁడు
భీమనాథేశ్వరు కామితార్థప్రదు, కామితదివ్యలింగంబుఁ జొచ్చె


తే.

మెఱుఁగు మేఱచినపగిదిని మెఱయ దీప్తి, నద్భుతంబును బొందిరి యపుడు వారు
గౌరి! యిది భీమలింగంబు గౌరవంబు, దక్షవాటీపురీమహాస్థానమునను.

19


వ.

అనంతరం బమ్మునీశ్వరులు నియమశ్రద్ధాతాత్పర్యంబు లొప్ప సప్తర్షిసమానీతయగు గోదావరిఁ గనుంగొని పరమానందంబున.

20


శ్లో.

దేవి! శంభోర్జటాజూటనివాసిని! శివప్రియే!
లోకరక్షణ కార్యార్థ, ముద్భూతాయై నమోస్తు తే.

21


శ్లో.

ఏకేనైనస్వరూపేణ, భీమనాథస్యసన్నిధౌ
సదా సన్నిహితా స్యత్ర, గోదావరి! నమోస్తు తే.

22


క.

అని సంస్తుతించి యందఱు, మునిగణములు మంకణముని మునుకొని వికచ
త్కనకారవిందసౌరభ, ఖనన యగునయ్యేటినీటఁ గౌతుక మొప్పన్.

23