124
శ్రీ భీమేశ్వరపురాణము
| త్రంబునం బాపౌఘంబును నదిభస్మీభావంబునుంబొందింపంజాలును. ప్రాణవియోగ కాలంబున జంతుకోటికిం గాలకంధరుండు తారకబ్రహ్మవిద్యారహస్యార్థం బుపదేశించును. కానిమాత్రంబైన ధనంబును బిడికెఁడు ధాన్యం బైన నిచ్చుదాతకు ననంతఫలంబు చెందు. శ్రద్ధాసమన్వితంబుగా శివయోగికిం బెట్టిన భోజనంబును నిచ్చిన వస్త్రంబును భవబంధవిధ్వంసనంబులు. జపహోమదానతపోధ్యానసమాధియోగంబులు గలుగు పుణ్యులకుం గొలఁది లేదు. హిమవత్పర్వతంబునఁ గోటివర్షంబులు తపంబుచేసినఫలంబు ఘటికార్ధోపవాసమాత్రంబునను, వారణాసియందుఁ గోటిబ్రాహ్మణులకు భోజనంబుపెట్టినఫలంబు భిక్షునకు నొక్కభిక్ష యిడినమాత్రంబునను, గురుక్షేత్రంబున సూర్యగ్రహణకాలంబునం దులాపురుషదానంబు చేసినఫలంబు నొక్కభూసురాతి కథితి కభ్యాగతికి శివయోగులకుఁ బెట్టినభోజనమాత్రంబునను, దక్షవాటికాపుణ్యక్షేత్రంబున సంభవించు. | 15 |
తే. | భీమలింగంబు త్రిభువనస్వామి యెపుడు, సన్నిధానంబుఁ గైకొనియున్నకతనఁ | 16 |
తే. | ఘనత శివగంగయును రుద్రగంగ యనఁగఁ, గూపములు రెండు దక్షవాటీపురమున | 17 |
ఆ. | అని వరంబు లిచ్చి యంతర్హితుం డయ్యె, నిందుమౌళి ఋషుల కెట్టయెదుట | 18 |
సీ. | పంచాక్షరీమంత్రపారాయణంబులు, పఠియించుచును స్పష్టఫణితితోడ | |
తే. | మెఱుఁగు మేఱచినపగిదిని మెఱయ దీప్తి, నద్భుతంబును బొందిరి యపుడు వారు | 19 |
వ. | అనంతరం బమ్మునీశ్వరులు నియమశ్రద్ధాతాత్పర్యంబు లొప్ప సప్తర్షిసమానీతయగు గోదావరిఁ గనుంగొని పరమానందంబున. | 20 |
శ్లో. | దేవి! శంభోర్జటాజూటనివాసిని! శివప్రియే! | 21 |
శ్లో. | ఏకేనైనస్వరూపేణ, భీమనాథస్యసన్నిధౌ | 22 |
క. | అని సంస్తుతించి యందఱు, మునిగణములు మంకణముని మునుకొని వికచ | 23 |