పుట:భీమేశ్వరపురాణము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

శ్రీ భీమేశ్వరపురాణము


యందు మిహిరుం డుండఁగను, ఫాల్గునమాసంబున నుత్తరానక్షత్రంబున మీనరాశినిం దినకరుం డుండఁగను, బూర్వోక్తప్రకారంబున శైవవ్రతాచారంబులు నడపిన మనుజుండు, పాతకంబులవలన విముక్తుండగును; వెండియు యజ్ఞతీర్థం బను తటాకంబు సకలతీర్థరాజంబు.

30


సీ.

మేషరాశిస్థుఁడై మిహిరుఁ డుండగఁ బర్వ, తిథి స్నాతు డగుచుఁ దత్తీర్థమందుఁ
దనయథాశక్తిఁ గాంచనము విప్రుల కిచ్చి, పాతకంబులఁ బాయుఁ బంచజనుఁడు
వృషభంబునం దట్ల వెండి మార్తాండుండు, మిథునరాశిం దగమెచ్చు మీఱు
స్థితిఁ గర్కటకరాశిఁగృతసప్తగోదావ, రాభిషేకుఁడు దోష మపనయించుఁ


తే.

దప్ప కాషాఢసితచతుర్దశిని సింహ, కన్యలను సూర్యసంగమకాలమునను
జన్మతారయందున సంధులందు, యజ్ఞకుండవయస్స్నాన మఘరహంబు.

31


తే.

భానుమంతుండు తులమీఁదఁ బవ్వళింప, యజ్ఞకుండతటాకంబునందుఁ గ్రుంకి
బ్రహ్మహత్యాదులైన పాపనిచయములఁ, బంచబంగాళముగఁ దోలుఁ బంచజనుఁడు.

32


క.

ఆదిత్యుఁడు వృశ్చికమునఁ, బాదం బిడినట్టివేళఁ బావనతిథి సూ
ర్యోదయమున యజ్ఞతటా, కోదకమునఁ గ్రుంకి మనుజుఁ డొడుచు నఘంబుల్.

33


తే.

ఇనుఁడు కోదండరాశియం దెక్కియుండ, రుద్రనక్షత్రమునను మర్త్యుండు నియతి
యజ్ఞకుండపయస్స్నాన మాచరించి, సృష్టిలోఁ దోలుఁ బాతకశ్రేణి నెల్ల.

34


తే.

మకరరాశిస్థుఁడై భానుమంతుఁ డుండఁ
బుష్యనక్షత్రమునఁ బ్రొద్దుపొడుచునపుడు
భానువాసరమున యజ్ఞభద్రసరసిఁ
గ్రుంకి పాతకచయముల పొంక మణఁచు.

35


క.

మాఘమునఁ గుంభరాశి ని, దాఘద్యుతి యుండ సప్తతాపపవాహి
న్యోఘమున మునుఁగునరుఁ డఖి, లాఘవిఘటితుఁ డగుచుండు హావప్రౌఢిన్.

36


తే.

ఫాల్గునంబున నుత్తరాఫల్గునినిని, మీనరాశిని సూర్యుండు మెలఁగుచుండ
సప్తగోదావరాభిషేచనము సేయఁ, బాతకవ్రాతములనెల్ల భంగపరచు.

37


మ.

ప్రతివేళం దగ మర్త్యుఁ డీక్రియం జరింపంబాడి యంగీకృత
వ్రతుఁడై దక్షిణకాశియందు బహుళస్వర్గాపవర్గార్థమై
శితికంఠప్రియమందిరంబయిన యీక్షేత్రంబునం దెచ్చటన్
మృతుఁడైయున్న నరుండు పొందు గమికర్మీభూతకైవల్యమున్.

38


క.

కనకం బణుమాత్రంబై, నను దక్షారామనగర నైకటికమహా
మునిసింధువుదరి దానం, బొనరించుట మేరుదాన ముర్విం దలఁపన్.

39