పుట:భాస్కరరామాయణము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ్చట నిలువంగలేక వెఱఁ జయ్యన నేఁగె మరుండు నయ్యెడన్.

650


మ.

తనవిస్ఫారతపంబు గొంత దఱుఁగం దా నాత్మ వేయేఁడు లిం
క నిరాహారుఁడ నిర్జితేంద్రియుఁడ నేకస్వాంతవృత్తుండ నై
చన నుద్యత్తప మూర్పు వుచ్చ కతినిష్ఠం దాల్మితోఁ జేసెదన్
నను బ్రహ్మర్షిని నీ వటం చజుఁడు సన్మానంబుతోఁ బల్కఁగన్.

651


వ.

అనుచు నుత్తరంబు విడిచి తూర్పుదెస కరిగి సిద్ధాశ్రమభూమియందు.

652


ఉ.

ఆరఁ దపంబు వత్సరసహస్రము నిండఁగఁ జేసి యాసతోఁ
బారణ సేయ నున్నతఱి బ్రాహ్మణుఁ డై బలభేది వేఁడ నిం
పారఁగ భోజనం బిడఁగ నన్నము సర్వముఁ దా గ్రహించినన్
నారక వెండియుం దపము వర్షసహస్రము సల్పుచుండఁగన్.

653


క.

ఆకౌశికునౌదల నతి, భీకరగతిఁ బొగలు నెగసి పేర్చి దిశాచ
క్రాకాశంబులు నిండఁగ, నాకము గంపించె రాలె నక్షత్రంబుల్.

654


క.

కడు బెగడు గుడిచె భువనము, లుడుగక జలనిధులు గలఁగె నుడుపథమునఁ బె
న్మిడుఁగుఱు లెడనెడఁ బొడమఁగ, వడిఁ బిడుగులు వడియెఁ బుడమి వడవడ వడఁకెన్.

655


వ.

అట్టియెడ.

656


క.

సురలును గంధర్వులు ముని, వరులుం బరమేష్ఠికడకు వాంఛం జని యా
సరసిజసంభవునకు నా, దరమునఁ బ్రణమిల్లి యాపితామహుతోడన్.

657


శా.

బ్రహ్మం బైనతపంబుఁ గౌశికుఁ డొనర్పం జొచ్చె నమ్మౌనికి
న్బ్రహ్మర్షిత్వము నైన బ్రహ్మపద మైనన్ వేగ యీకుండినన్
బ్రహ్మాండంబులు దత్తపోగ్నిశిఖలన్ భస్మంబు లౌ నావుడున్
బ్రహ్మణ్యుం డగుబ్రహ్మ సంయమినిలింపస్తోమముల్ గొల్వఁగన్.

658


మ.

చన నేతెంచి భవత్తపోమహిమ విశ్వామిత్ర బ్రహ్మర్షి వై
తనిశంబుం దప మింక నేల యన బ్రహ్మం జూచి బ్రహ్మాత్మజుం
డును బ్రహ్మర్షియు నైనపుణ్యుఁడు వసిష్ఠుం డిచ్చ నిక్కంబుగా
నను బ్రహ్మర్షిపదుండ వై తనక నే నమ్మన్ జగద్రక్షకా.

659


మ.

అనుడున్ బ్రహ్మయు సర్వదేవతలుఁ గామ్యం బొంద రప్పింపఁ జ
య్యన నేతెంచి తపోమహత్వమునఁ దథ్యం బొంద బ్రహ్మర్షి వై
తనుమానింపకు మన్నఁ గౌశికుఁడు నెయ్యం బొప్ప భక్తిన్ వసి
ష్ణునిఁ బూజించెఁ బ్రియంబుతోఁ జనిరి తోడ్తో నంత బృందారకుల్.

660


వ.

అని పలికి శతానందుండు రామచంద్రా
కేవలతపోమూర్తి యగు కౌశికుతపస్సా
మర్థ్యంబులు చెప్ప ననేకంబు లనిన రామలక్ష్మణులు నక్కడినభాసదులు నాశ్చ
ర్యసంతోషంబులం దేలి విశ్వామిత్రుం బ్రశంసించి పూజించి రంత.

661


క.

నాకులజుఁడైన రాముఁడు, శ్రీకంఠునివిల్లు విఱిచి సీతం బ్రీతిం