Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

పుత్తెంచినవా రని దివి, కత్తెఱవను వీడు కొల్పి యంగజు గెల్వం
జిత్తమునఁ గోరి వేయేం, డ్లుత్తరగిరివెనుకఁ దపము నుగ్రతఁ జలిపెన్.

642


తే.

అట్లు కౌశికుఁ డుత్తరమందు ఘోరతపము సేయంగ దేవతల్ దలఁకి వచ్చి
యజ్ఞభవుఁ గాంచి నీవు మహర్షి వనఁగఁ, గౌశికుం డర్హుఁ డన నగుఁగాక యనుచు.

643


మ.

అజుఁ డే తెంచి మహర్షి వైతి వనఁగా నాబ్రహ్మ నీక్షించి య
బ్జజ నీ వారసి నిక్కువంబుగ ననున్ బ్రహ్మర్షి వన్నంతదాఁ
క జయం బొందఁ దపం బొనర్తు నన నౌఁ గా కంచు లోకేశనా
కజు లేఁగన్ మఱియుం జలంబు నెఱయన్ గాధేయుఁ డత్యుద్ధతిన్.

644

విశ్వామిత్రుండు రంభను శపించుట

అనిలాహారుఁడు నూర్ధ్వబాహుఁడు నిరాహారుండు నై సీతునం
దనరం దోయములందు వేసవిఁ దగం బంచాగ్నిమధ్యంబునన్
ఘనవర్షాగమవేళ బట్టబయలం గా నుండి వేయబ్దముల్
సన నత్యుగ్రతపంబు నోపి సలుపన్ జంభారి రంభం దగన్.

645


చ.

కనుఁగొని రంభ దేవహితకార్యము సేయఁగ నేఁగి గాధినం
దనుతప మంతయుం జెఱుపు నావుడు నన్ను శపించుఁ గిన్క న
మ్ముని తెరు వేను బో వెఱతు మూర్ఖుఁ డతం డని పల్క నోడ కేఁ
బనుపడి నీకుఁ దో డమరఁ బంపెదఁ జయ్యనఁ బుష్పబాణునిన్.

646


వ.

ఏను నీవెనుకన వచ్చెద నని పనిచిన.

647


సీ.

చారుచంద్రికతోడి చంద్రబింబముఁబోలె, మందహాసానన మంద మొంద
నింద్రనీలప్రభ నెడనెడ వెదచల్లు, కుంతలకాంతులు కొమరు మిగులఁ
బద్మరాగప్రభల్ పైపయి నిగిడించు, పాదపల్లవరుచుల్ ప్రజ్వలింప
బాలాతపము గాయు పసిఁడికుండలమాడ్కిఁ, గుంకుమపరిలిప్తకుచము లమరఁ


తే.

గనకరేఖాసమాకృతిఁ దనువు మెఱయ
రాజహంసయానంబున రంభ వచ్చి
చిత్తభవుఁ జేయఁ గోయిల చెలఁగి కూయ
శ్రుతులఁ గూడఁ బాడుచుఁ దనమ్రోలఁ బొలయ.

648


మ.

అపు డీక్షించి ననుం దపోవిముఖుఁ జేయన్ వజ్రి పుత్తెంచినం
గపటేచ్ఛం జనుదెంచి యున్నది కడుగర్వంబుతో నంచు న
చ్చపలాక్షిం బటురోషవేగమున విశ్వామిత్రుఁ డత్యుగ్రుఁ డై
శపియించెం బదివేలవర్షములు పాషాణత్వముం బొందఁగన్.

649


చ.

అటు శపియించి శాపవిహితావధికాలము నిండఁ జన్నమీఁ
దట నొకపుణ్యుఁ డైన వసుధామరవర్యునిచేత నీ వతి
స్ఫుటముగ శాపమోక్షణముఁ బొందెదు నా శిల యయ్యె రంభ య