పుట:భాస్కరరామాయణము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పనుపడ నంతవిఁదఁ గ్రతుకభాగము లొందఁగ వచ్చుదివ్యులన్.

522


వ.

చూడవలయు నని పలికి మఱియు నతికౌతుకంబున రామలక్ష్మణులం గనుంగొని.

523


మ.

కరిసింహాంచితగాము లశ్వినిసమాకారుల్ దళత్పద్మభా
స్వరనేత్రుల్ గమనీయయౌవనులు గీర్వాణ ప్రతాపుల్ భయం
కరశార్దూలమహోక్షసన్నిభులు లోకత్రాణపారీణు లు
దు్ధుకోదండకృపాణబాణయుతదోస్స్థూణుల్ ప్రవీణుల్ గడున్.

524


వ.

ఈరాజన్యకుమారశేఖరులు పాదచారు లై వచ్చుట కేమి కారణం బని యడుగఁ
గౌశికుండు జనకుం గనుంగొని వీరలు రామలక్ష్మణు లనువారలు దశరథనందనులు
నావెనుక సిద్ధాశ్రమంబున కేతెంచి యచట నవక్రపరాక్రమం బడర.

525


ఉ.

తాటకఁ ద్రుంచి వైచి యతిదర్పితుఁ డైనసుబాహు సాయకో
త్పాటితుఁ జేసి గీటడఁచి ధర్మ మెలర్ప నహల్యశాప ము
చ్చాటన మొందఁజేసి కడుసమ్మద మారఁగ నీగృహంబునం
జాటఁగ నున్నశంకరునిరచాపముఁ జూడఁగ వచ్చి రేర్పడన్.

526


వ.

అనవుడు నప్పు డహల్యానందను డైనశతానందుం డపరిమితానందుఁ డై వి
శ్వామిత్రు నవలోకించి మాతల్లిదండ్రులకుఁ గూటమి గలిగె నేము గృతార్థుల
మైతి మనుడు నతని కతం డిట్లనియె.

527


క.

జమదగ్ని రేణుకం బ్రే, మమునం గలసినవిధం బమర గౌతమసం
యమియు నహల్యం దనసతి, సముచితగతిఁ గలిసి వాంఛ సలుపఁగఁ జనియెన్.

528


వ.

అనినం గ్రమ్మఱ రోమాంచకంచుకితగాత్రుం డై శతానందుం డి ట్లనియె.

529


చ.

దినకరవంశదీపకునిఁ దెచ్చి మునీశ్వర మమ్ముఁ బ్రోచి తీ
యనఘునిదర్శనంబున మదంబయు దుస్తరశాపముక్త యై
తనపతిఁ గ్రమ్మఱం గలిసెఁ దద్దయు నున్నతి కెక్కె మాకులం
బనుచుఁ బ్రియంబుతోఁ బలికి యానృపపుత్రులఁ జూచి యి ట్లనున్.

530


వ.

రఘురామచంద్రా మత్కులవార్ధచంద్రా భవద్దర్శనంబున మజ్జననీజనకుల కంచి
తసంయోగంబు గలిగెఁ గౌశికపాలితుండ వగునీకు నెల్లెడల నెందును భద్రంబ
వినుము చెప్పెదఁ గౌశికుపరాక్రమంబును దపఃప్రభావంబును; మున్ను ప్రజాప
తికిం గుశుం డుదయించె నతనికిఁ గుశనాభుం డుదయించె నతనికి గాధి యుద
యించె నాగాధికి విశ్వామిత్రుండు పుట్టి తేజం బెసంగ ననేకసహస్రవర్షంబులు.

531

విశ్వామిత్రునిచరిత్రము

క.

 అశ్వద్విపరథభటబల, శాశ్వతలక్ష్మీసమృద్ధిసంకలితుం డై
విశ్వధరిత్రీచక్రము, విశ్వామిత్రుండు నీతి వెలయఁగ నేలెన్.

532


వ.

అట్లు రాజ్యంబు సేయుచు నొక్కనాఁ డక్షౌహిణీసేనాపరివృతుండై నగరంబుల
నానారాష్ట్రంబుల మహానదుల నానాశ్రమవనంబులఁ గ్రుమ్మరుచు బహుళపరిమళ