పుట:భాస్కరరామాయణము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తరుణి నినుఁ జూచినప్పుడె, పరితుష్టుఁడ నైతి నింకఁ బ్రసవాయుధజి
త్వరుఁడ నయి పోదు నని త, త్పరమతి వాంఛితముఁ దీర్చి తత్తఱపడుచున్.

505


క.

ఉటజము వెలువడి యట ముం, దటఁ దాఁ బొడగాంచె వృత్రదమనుఁడు వికటో
త్కటవిస్ఫుటజటి నతిసం, ఘటితతపఃకృశశరీరకంపనకలితున్.

506


మ.

కరసంయుక్తసమిత్కుశాంచితుని గంగాపూతతోయార్ద్రభా
స్వరమూర్తిన్ గతధూమసంజ్వలితసజ్వాలాగ్నికల్పున్ సురా
సురదుర్దర్షుని నక్షపాదు రచితశ్రుత్యర్థవాదున్ వ్రతా
విరళామోదు సుధీయుతుం బ్రతిహతావిద్యాతమున్ గౌతమున్.

507


క.

అప్పుడు గౌతముఁ డింద్రుని, నిప్పులు రాలంగఁ జూచి నీవు కపటి వై
చొ ప్పగునారూపంబునఁ, ద ప్పొనరించితి దురాత్మ తగ దన కంచున్.

508


క.

చండక్రోధంబున నీ, యండంబులు దునిసి దర్ప మడఁగు దురాచా
రుండ యనఁగ నాఖండలు, నండంబులు దునిసి పుడమి నప్పుడ పడియెన్.

509


వ.

ఇ ట్లయ్యింద్రుని శపియించి యహల్య నమాంగల్యం గదిసి యీవనంబున ననే
కదివ్యసహస్రవర్షంబులు నాయుభక్షణవు నిరాహారవు భస్మశాయినివియు
యెవ్వరికిం గానరాక పాషాణంబ వై యుండు మని యంతటఁ గరుణార్ద్రమన
స్కుం డై యెప్పు డివ్వనంబునకు రామచంద్రుండు వచ్చు నప్పుడు శాపవిముక్త
వై తదాతిథ్యసత్కారంబున నిజరూపంబు గైకొని ముదం బందెద వని పలికి
యీయాశ్రమంబు విడిచి సిద్ధచారణసేవితం బైనహిమగిరిశిఖరంబున కేఁగి తపం
బాచరించుచుండె.

510


సీ.

అనిమిషేశ్వరుఁ డంత ననలాదిదేవతా, గణములు సిద్ధచారణులఁ జూచి
యమలోగ్రతపము గౌతముఁ డర్థిఁ గావింపఁ, దత్తపం బమరహితంబు గాఁగఁ
జెఱుపంగ నే నేఁగి చిత్తంబుఁ గలఁగింప, ఘనకోపమున నన్నుఁ గనలి చూచి
విఫలుఁగా శపియించె వేగ దానం జేసి, తప మెల్లఁ జెడిపోయె దర్ప మడఁగె
విఫలుఁడగునన్ను మీరలు సఫలుఁ జేయుఁ, డనినఁ బితృదేవతలఁ జేరి యమరు లంత
మేషముష్కము ల్గొనివచ్చి మేఘవాహ, నునకుఁ బొందుగ హ త్తింపుఁ డనిన వారు.

511


క.

దండిం బితరులు వెస మే, షాండంబులు ద్రెంచి తెచ్చి హత్తించిన నా
ఖండలుఁ డది యాదిగ మే, షాండుం డయ్యెనని పలికి యమ్ముని మఱియున్.

512


క.

ఇది యాగౌతమునాశ్రమ, పద మిచ్చట నమ్మహానుభావునిసతి యు
న్నది దగ నహల్య యెంతయు, మద మఱి ప్రతిశాపతప్తమానస యగుచున్.

513


క.

రామ యహల్యకు నీవు ద, యామతి శాపంబు నాప నరుగుము నా నా
రాముఁడు విశ్వామిత్రుఁడు, సౌమిత్రియుఁ దోడ రా వెసం జని యెదురన్.

514


సీ.

జలమధ్యసందీప్తశసవితృదీధితిమాడ్కి, నతిదురాధర్ష యై యమరుదాని
భూరిహిమవృతపూర్ణచంద్రికవోలె, నశ్రుధారామగ్న యైనదానిఁ