పుట:భాస్కరరామాయణము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బోవుద మనుసమయంబున.

493


చ.

సుమతి మునీంద్రురాక విని సుప్రియుఁడై యెదురేఁగుదెంచి యు
త్తమమతిఁ బూజ లిచ్చి కడుధన్యుఁడ నైతిఁ ద్వదీయదర్శనం
బమరపదంబు నాకు నిటు లబ్బె మునీశ్వర యంచుఁ బల్కి సే
మము తగఁ బ్రీతితో నడిగి మానుగఁ గౌశికుతోడ ని ట్లనున్.

494


మ.

కరిసింహాంచితగాము లశ్వినిసమాకారుల్ దళత్పద్మభా
స్వరనేత్రుల్ కమనీయయౌవనులు గీర్వాణప్రతాపుల్ భయం
కరశార్దూలమహోక్షసన్నిభులు లోకత్రాణపారీణు లు
ద్ధురకోడండకృపాణబాణయుతదోస్స్థూణుల్ ప్రవీణుల్ గడున్.

495


క.

ధర విహరింపఁగ వచ్చిన, తరణిసుధాకరులొ దేవతావరులొ పర
స్పరసదృశేంగితచేష్టిత, పరిమాణముల సరి యగుచుఁ బరఁగెద రిచటన్.

496


ఉ.

ఈసుకుమారు లెవ్వ రిట కేటికి వచ్చిరి పాదచారు లై
భాసురపుణ్య నా కెఱుఁగఁ బ్రాజ్ఞతఁ జెప్పుము నాఁగఁ గౌశికుం
డాసుమతిక్షితీశ్వరున కారఘురాముఁడు వచ్చి యాగతిం
జేసినవిక్రమక్రమము చెప్పిన వచ్చెరు వంది వేడ్కతోన్.

497


వ.

రామలక్ష్మణులకు నతిథిసత్కారంబు లత్యాదరంబునం జేయం పైకొని యారాత్రి
యచ్చట వసియించి మఱునాఁడు మిథిలాపురంబున కేఁగి తదుపవనంబుఁ
బొడగని కౌశికునకు రామచంద్రుం డి ట్లనియె.

498


క.

అమరుచు నిచటఁ బురాణా, శ్రమ మున్నది మునులు లేక జనశూన్యం బీ
రమణీయాశ్రమ మేయు, త్తమమునియాశ్రమము మున్ను తజ్ఞతఁ జెపుమా.

499


క.

అనవుడు విశ్వామిత్రుం, డినకులనాయకునిఁ జూచి యి ట్లనుఁ దగ నీ
వినుతాశ్రమంబు గౌతమ, మునిపుంగవునాశ్రమంబు మును విను మనఘా.

500


క.

ఈపుణ్యాశ్రమవనమును, బ్రాపించి యనేకగణసహస్రాబ్దము లు
ద్దీపితతప మంచితవి, ద్యాపరుఁ డై గౌతముఁడు నహల్యయుఁ జలుపన్.

501


క.

ప్రీతిఁ దఱి వేచి యింద్రుఁడు, గౌతమవేషంబు పొసఁగఁ గైకొని వేగం
బేతెంచి రూపలావ, ణ్యాతుల్య నహల్యఁ జూచి యతిమోహితుఁ డై.

502


క.

కోరిక లొప్పారఁగ నా, సారసముఖిఁ జేరి పాకశాసనుఁ డంతం
జారునితంబిని నన్నున్, మారసుఖక్రీడఁ దనుపు మక్కువతోడన్.

503


చ.

అనుడు నహల్య యింద్రుఁడు ప్రియంబున గౌతమవేషి యైనవాఁ
డని మదిలో నెఱింగి ముద మందఁగ నిక్కడ రమ్ము గ్రక్కునన్
మనసిజునమ్ములం దునిసె మానము చిక్కినమన్మథుండ వై
నను రతిచాతురిం గవిసి నన్నును నిన్నును గావు నావుడున్.

504