పుట:భాస్కరరామాయణము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

కలగొన నేడుఖండములు గా నతిఘోరభుజార్గళస్ఫుర
త్కులిశకఠోరధార వడిఁ గోయ నురుధ్వని బిట్టు గర్భ ము
మ్మలికముతోడ నేడువఁగ మారుద మారుద యంచు వెండియున్
నిలువక కోయఁగా నపుడు నిద్దుర దేఱి సవిత్రి యి ట్లనున్.

484


క.

వడి నిటు నలఁపకు చంపకు, వెడలుము నీ వనుడు వెడలి వినయముతోడం
బొడచూపి తల్లి ననుఁ దుని, మెడిగర్భము ద్రుంచితిన్ క్షమింపుము నన్నున్.

485


క.

నీ వశుచివి నిద్రితవుం, గావున నీగర్భ మేడుఖండంబులుగాఁ
గావించితి ననవుడు దితి, యావిధ మగుగర్భహాని కతిదుఃఖిత యై.

486


క.

వాసవుఁ డసాధ్యుఁ డగుటన్, గాసిల శపియింప రాక కడువగమై నా
వాసవుతో ని ట్లను నా, చేసినయపరాధ మిట్లు సేసెం దనుజా.

487


క.

నీ వేమి చేయు దింకను, నీవలనన్ సొలయ నేను నిను వేఁడెద స
ద్భావమున నాదుకోరిక, గావింపుము సమ్మదమున గారవ మారన్.

488


వ.

పుత్రా భవత్కులిశదళితగర్భసప్తఖండంబులు సప్తమారుతంబు లై గగనవాత
స్కంధంబులం జరియింప నిమ్ము మఱియుం బ్రథమమారుతంబు బ్రహ్మలోకంబున
ద్వితీయమారుతం బింద్రలోకంబునఁ దృతీయమారుతంబు గగనంబునం దక్కిన
చతుర్మారుతంబులు నలుదిక్కుల దేవతామూర్తులై నీయాజ్ఞం జరియింప నిమ్ము
నీవు మారుద మారుద యనుట మారుతాహ్వయంబులం బరఁగ ని మ్మనిస నిం
ద్రుండు దితి కి ట్లనియె.

489


మ.

జననీ నీ విటు నన్నుఁ గోరిన సమస్తంబుం గృతార్థంబుగాఁ
దనరం జేసెద నీతనూజులు నమర్త్యస్ఫూర్తులై యేజవేగం
బుననైనం జరియించుచుండెదరు సమ్మోదింపు నీ వంచు సం
పెనయం బల్కి సవిత్రితో దీవికి నరయ్యింద్రుండు వోయెం దగన్.

490


క.

క్లేశయుతతపము దితి పు, త్రాశం జేయఁ బరిచర్య లాదితికిన్ దే
వేశుం డొనర్చుచుండిన, దేశం బిద్దేశ మఖిలదేశాధీశా.

491


క.

వినుము ఘనుం డగునిక్ష్వా, కునకు నలంబసకుఁ బుట్టెఁ గొడుకు విశాలుం
డన నతఁ డేలుట నిప్పురి, జను లెల్ల విశాల యనఁగ జగతిం బరఁగెన్.

492


వ.

ఆవిశాలునకు హేమచంద్రుండును హేమచంద్రునకు సుచంద్రుండును సుచంద్రు
నకు ధూమ్రాశ్వుండును ధూమ్రాశ్వునకు సృంజయుండును సృంజయునకు సహ
దేవుండును సహదేవునకుఁ గుశాశ్వుండును గుశాశ్వునకు సోమదత్తుండును
సోమదత్తునకుఁ గకుత్స్థుండును నతనికి సుమతియుం బుట్టి రిప్పుడు విశాలను సుమ
తి యేలుచున్నవాఁ డిక్ష్వాకునందను లండఱు విశాల యేలుటం జేసి వైశా
లికులు నతిధార్మికులును దీర్ఘాయుష్మంతులు వీర్యవంతులు నై పరఁగుదురు
రామచంద్రా యీ రాత్రి యీపురిని విశ్రమించి యెల్లి జనకునిం జూడఁ