పుట:భాస్కరరామాయణము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పంబులం బాసి యాయురారోగ్యంబులు నైశ్వర్యంబులుఁ బుత్రసంపత్తియు ధన
ధాన్యంబులు సకలకామ్యార్థసిద్ధులుం గలిగి నాకలోకఫలప్రాప్తుం డగు నని వి
శ్వామిత్రుండు వినిపింప ననుజసమేతుం డైనరామచంద్రుం డచ్చెరు వందుచుఁ
గౌశికున కి ట్లనియె.

462


క.

మునివర గంగాగమనం, బును సాగరపూరణంబు ముదమున నీచే
వినఁగా క్షణమై రాతిరి, చనియెను మది విమల మయ్యె సమ్మద మొదవెన్.

463


క.

అని వెఱఁగందుచు నాకథ, మనమునఁ దలపోయుచుం దమస్విని వే వే
గినఁ బ్రథమాహ్నికకృత్యము, లనుజుండును దా నొనర్చి యనురాగమునన్.

464


క.

ఈగంగను దాఁటుద మని, యాగాధిసుతుండు దశరథాత్మజులు మహా
భాగు లతిపుణ్యభాగిని, భాగీరథి నుత్తరించి ప్రముదితు లగుచున్.

465


క.

లీలాలోలత నుత్తర, కూలంబున నిలిచి కనిరి కోర్కులతో భూ
పాలక గజహయమణిగణ, జాలను లక్ష్మీవిశాలఁ జారువిశాలన్.

466


క.

కనుఁగొని విశ్వామిత్రుఁడు, జననాయకసుతులతో విశాలాపురికిం
జనునెడ రాఘవుఁ డమ్ముని, కను నీపురి కధిపుఁ డెవ్వఁ డనఁ గౌశికుఁడున్.

467


క.

ఘనుఁ డగురామునిఁ గనుఁగొని, యినకులనాథసుత నీకు నీనగరిపురా
తనవృత్తాంతము సర్వం, బును జెప్పెద వినుము రామ పూర్వయుగాదిన్.

468

క్షీరసాగరమథనము

చ.

సుమతుల నాదితేయదితిజుల్ దలపోసి సునిశ్చితాత్ము లై
యమరుల మై నిరామయుల మై యజరాంగుల మై వెలుంగ ను
ద్యమమున వార్ధిఁ ద్రచ్చి తగ నం దమృతం బుదయింపఁ గాంక్ష న
య్యమృతముఁ ద్రావఁగా మనకు నయ్యెడు సర్వమనోరథంబులున్.

469


క.

అని నిర్ణయించి వాసుకి, యనుఫణిపతిఁ జేరు మందరాద్రిని గవ్వం
బునుగా నొనర్చికొని దితి, తనయులు నయ్యదితిసుతులుఁ దగ దుగ్ధాబ్ధిన్.

470


మ.

ఉరుశక్తిం దరువంగఁ జొచ్చిరి సమిద్ధోల్లోలకల్లోలస
త్వరడోలాతతి వేల దాఁటగ సముద్యద్బిందువుల్ తారకా
పరిషేకంబులు సేయ బుద్బుదతతుల్ పై నుప్పతిల్లంగ దు
స్తరనిర్ఘాతఘుమంఘుమధ్వనులఁ బాతాళంబు ఘూర్ణిల్లఁగన్.

471


క.

ఉరుబలమున ని ట్లితరే, తరులు మిగులఁగాఁ బయోధి దరిగొని వేవ
త్సరములు దరువఁగ ధన్వం, తరి దండకమండలువులు చాలిచి పొడమెన్.

472


వ.

తదనంతరంబ.

473


చ.

అఱువదికోటు లప్సరస లంచితమూర్తులు పుట్టి రోలి న
త్తఱి మఱి వారికిం దగినదాసు లసంఖ్యులు సంభవించి ర
త్తెఱవలు దమ్ము నెవ్వరుఁ బ్రతిగ్రహణంబులు సేయకుండుటన్