పుట:భాస్కరరామాయణము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూపతు లనేకు లాఘన, చాపములా వెఱుఁగ వేఁడి చనుదెంచి భుజా
టోపముల నెక్కుపెట్టఁగ, నోపక వే పోదు రరుదు నొందుచు మరలన్.

301


వ.

అని పలికి మునిగణసహితుండై రామలక్ష్మణులు తనవెంట నేతేర వనదేవతలార
యీసిద్ధాశ్రమంబునం దపస్సిద్ధుండ నైతి మీకు భద్రంబు గానిమ్ము పోయి వచ్చె
ద ననుచుం బలికి జాహ్నవియుత్తరతీరంబున హిమగిరిం గని ప్రదక్షిణపూర్వ
కంబుగా నమస్కరించి యుత్తరాభిముఖుం డై చన వెనుక సిద్ధాశ్రమవాసు లైన
మృగపక్షిజనంబులు చనుదేరం గడుదూరపథం బరిగి యస్తమయసమయంబున
శోణనదీకూలంబున సంధ్యాద్యనుష్టానంబులు సలిపి యొక్కనివాసంబు ప్రవేశిం
చి యాసీనులై యుండ విశ్వామిత్రు నచటిమునిజనులు పూజించి రప్పు డారామ
చంద్రుండు గౌశికుముందటఁ గూర్చుండి యోమునివరేణ్యా యీసమృద్ధవనశో
భితం బైనదేశం బెవ్వరిదేశం బెఱింగింపు మనిన విశ్వామిత్రుండు రామచంద్రున
కిట్లనియె.

302

కుశనాభుం డనురాజర్షి వృత్తాంతము

క.

కుశుఁ డన నొకమునిసుతుఁ డస, దృశమతి వైదర్భియందు ధీరులరక్షా
కుశలులు వసువుఁ గుశాంబుఁ, గుశనాభు నసూతరజునిఁ గోర్కిం గనియెన్.

303


క.

కని తనయులఁ గనుఁగొని నం, దనులార సధర్ము లగుచుఁ దనరఁ బ్రజాపా
లనపరు లై యుండుఁడు మీ, రనవుడు నాతండ్రిమాట కనుమతు లగుచున్.

304


వ.

కుశాంబుండు కౌశాంబీనగరంబును గుశనాభుండు మహదయాఖ్యపట్టణం
బు నసూతరజసుండు ధర్మారణ్యంబును వసువు గిరివ్రజం బనుపురంబును రచియిం
చిరి వసువుపేర నిబ్భూమి వసుంధర యనం బరఁగె నీశైలంబు లీభూమిచుట్టు
నుం బ్రకాశించుచుండు నీపంచశైలమధ్యంబున నొప్పెడుమాగధీనది మగధ
దేశంబుపైఁ బాఱుచుండుట నీభూమి మగధ యనంగ సుక్షేత్రయు సస్యమాలి
నియు నై విలసిల్లుచుండు నిది వసుదేశంబు వినుము.

305


క.

నరవర కుశనాభుం డనఁ, బరఁగెడు రాజర్షి గనియెఁ బ్రమదంబున న
చ్చర యగుఘృతాచివలన, న్సురుచిరరూపవతు లైన నూర్వురుసుతలన్.

306


క.

ఆరాజకన్య లభినవ, చారువిలాసంబు లారఁ జతురతరాలం
కారములు దాల్చి ఘనలీ, లారామము గాంచి చొచ్చి యనురాగమునన్.

307


ఉ.

జంగమవల్లులో యమృతరసాగరవీచులొ రత్నమూర్తులో
యంగజుమోహనాస్త్రములొ యంచితహేమశలాకలో మహీ
రంగనటత్తటిల్లతలొ రాజకశాసఖులో యనంగఁ ద
న్వంగులు వాద్యసంగతుల నాడుచుఁ బాడుచు నుండ నత్తఱిన్.

308


చ.

అనిలుఁడు వచ్చి వారిరుచిరాకృతు లచ్చెరువారఁ గాంక్షతోఁ
గనుఁగొని మాన మేది తమకం బొదవన్ నృపకన్యలార నా